News October 22, 2024

అశోక్‌నగర్‌లో గ్రూప్ అభ్యర్థుల నిరసన

image

అశోక్‌నగర్‌లో సోమవారం రాత్రి గ్రూప్-1 అభ్యర్థులు నిరసన చేపట్టారు. గ్రూప్ మెయిన్ పరీక్షలు నిర్వహించడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తామని పిలుపునిచ్చారు. రానున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బస్సు యాత్ర ద్వారా ప్రచారం చేస్తామని వెల్లడించారు.

Similar News

News November 26, 2025

రంగారెడ్డి జిల్లాలో త్వరలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు

image

2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించగా పదవీకాలం 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో RR జిల్లాలో సర్పంచులు, వార్డ్ మెంబర్లు లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయాయి. దీనికి తోడు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సైతం అందకపోవడంతో అభివృద్ధి పనులకు ఇబ్బందులు తప్పలేదు. నొటిఫికేషన్ రావడంతో త్వరలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.

News November 25, 2025

GHMCలోకి మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లు ఇవే!

image

☛మున్సిపాల్టీలు: పెద్దఅంబర్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, తుక్కుగూడ, మేడ్చల్, నాగారం, దమ్మాయిగూడ, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, IDAబొల్లారం,తెల్లాపూర్, అమీన్‌పూర్
☛కార్పొరేషన్‌లు: బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్, బోడుప్పల్,నిజాంపేట్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, బడంగ్‌పేట్ విలీనమవుతాయి.
ఇబ్రహీంపట్నం, కొత్తూర్, అలియాబాద్ లిస్ట్‌లో లేవు

News November 25, 2025

రంగారెడ్డి జిల్లాలో వార్డుల కేటాయింపు ఇలా

image

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న 526 గ్రామ పంచాయతీల పరిధిలో 4,668 వార్డులు ఉన్నాయి. వీటిలో 100% ST జనాభా ఉన్న పంచాయతీల్లో 238 వార్డులు మహిళలకు కేటాయించారు. మరో 238 వార్డులను పురుషులు, మహిళలకు కేటాయించారు. ఇక జనరల్ పంచాయతీలో ST మహిళలకు 106, పురుషులకు 153 స్థానాలు కేటాయించారు. ఎస్సీ మహిళలకు 378 వార్డులు కేటాయించగా.. 522 స్థానాలు మహిళలు, పురుషులకు కేటాయించారు.