News February 2, 2025

అశ్వాపురం: రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు

image

అశ్వాపురం మండలంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం… కారు, సైకిల్‌ను ఢీ కొట్టింది. ఈప్రమాదంలో మొండికుంట గ్రామానికి చెందిన వెంకన్న అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 21, 2025

బిజినెస్ కార్నర్

image

* హోండా కార్స్ ఇండియా కొత్త SUV ఎలివేట్ ఏడీవీని లాంచ్ చేసింది. HYDలో ఎక్స్ షోరూమ్ ధర ₹15.20 లక్షల నుంచి ₹16.66 లక్షల వరకు ఉంటుంది.
* HYDకి చెందిన బయోలాజికల్-ఇ తయారుచేసిన న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ న్యూబెవాక్స్ 14కి WHO గుర్తింపు లభించింది. ఇది 14 రకాల న్యుమోనియా, మెదడువాపు, సెప్సిస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
* అంతర్జాతీయ సంస్థలు సొనొకో, EBG గ్రూప్ HYDలో కార్యాలయాలు నెలకొల్పాయి.

News November 21, 2025

HYD: GOVT ఉద్యోగులపై దాడి చేస్తే క్రిమినల్ కేసులు

image

ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకాలు కలిగించినా, వారిపై దాడులకు దిగినా కఠినచర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ తెలిపారు. పోలీసులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ సిబ్బందితో సహా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించినా, దాడులు చేసినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధినిర్వహణలో ఉన్న ఉద్యోగులపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

News November 21, 2025

గజపతినగరం: పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

image

గజపతినగరం మండలం ఎం.గుమడాం గ్రామానికి చెందిన గంట్యాడ అప్పలనాయుడు మానసిక స్థితి బాగోలేనందున ఈనెల 19న పురుగులు మందు తాగినట్లు భార్య సత్యవతి తెలిపారు. అతడిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడుకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.