News December 8, 2024

అశ్వారావుపేటలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ 

image

తల్లి మందలించడంతో కూతురు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం అశ్వారావుపేటలో జరిగింది. ఎస్ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని దండాబత్తుల బజార్‌కు చెందిన సామినేని వెంకన్న, వరలక్ష్మీ దంపతుల కుమార్తె జశ్విత సాయి(17) ఇంటర్ చదువుతోంది. ఉదయం లంచ్ బాక్స్ సర్దుకునే విషయంలో తల్లీ, కూతురికి గొడవ జరిగింది. దీంతో క్షణికావేశంలో విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Similar News

News January 24, 2025

బాలికలు ఉన్నత రంగాల్లో రాణించాలి: ఖమ్మం కలెక్టర్

image

బాలికలు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌లో ‘బేటీ పడావో బేటీ బచావో’ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బేటీ బచావోకు మద్దతుగా నిర్వహిస్తున్న క్యాంపెయిన్ ఫ్లెక్సీపై సంతకం చేశారు. బాలికలు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు.

News January 24, 2025

అద్దె ఇంట్లో ఉన్నవారు అనర్హులని అనడం దారుణం: బీజేపీ

image

జూలూరుపాడు: అద్దె ఇంట్లో ఉన్న వారిని ప్రభుత్వం అనర్హులని తేల్చడం దారుణమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిజమైన అర్హులకు ప్రభుత్వ పథకాలు ఇచ్చేవరకు ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.

News January 24, 2025

ఖమ్మం: గ్రామసభల ఆప్డేట్ 

image

ఖమ్మం జిల్లాలోని 589 గ్రామపంచాయతీలలో మూడు రోజులపాటు గ్రామసభలు నిర్వహించారు. గురువారం వరకు జిల్లా వ్యాప్తంగా నాలుగు పథకాలకు 1,42,682 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారుల లిస్ట్‌లో అర్హుల పేర్లు లేకపోతే మరోమారు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో దరఖాస్తులు సమర్పించేందుకు గ్రామసభల వద్ద జనం బారులు తీరారు. సభలు నేడు చివరి రోజు కావడంతో దరఖాస్తులపై మరింత స్పష్టత రానుంది.