News February 4, 2025
అశ్వారావుపేట: ఎంపీటీసీ స్థానాల మార్పులకు కలెక్టర్ ఆమోదం

అశ్వారావుపేట పట్టణం మున్సిపాలిటీగా మారిన క్రమంలో ఎంపీటీసీ స్థానాల మార్పు అనివార్యమైంది. గతంలో మండల పరిధిలో 17ఎంపీటీసీ స్థానాలు ఉండగా 11స్థానాలకు కుదిస్తూ రూపొందించిన ఫైల్పై జిల్లా కలెక్టర్ సంతకం చేసినట్టు అధికారులు ప్రకటించారు. అందుకు సంభందించి వివరాలను స్థానిక ఎంపీడీవో, తహసీల్దార్, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నోటీసు బోర్డుపై ఉంచినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
Similar News
News September 17, 2025
సిద్దిపేట: పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయి: సీపీ

పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. బెజ్జంకి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మిర్జా యూసుఫ్ బేగ్ ఏఎస్ఐ గా ప్రమోషన్ పొందడంతో సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రమోషన్ పొందిన ఏఎస్ఐని ఆమె అభినందించారు. పోలీస్ శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్దతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికి గుర్తింపు, మర్యాద లభిస్తాయన్నారు. రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.
News September 17, 2025
ఈ నెల 23 నుంచి ఓటీటీలోకి ‘సుందరకాండ’

నారా రోహిత్, శ్రీదేవి, వర్తి వాఘని ప్రధాన పాత్రల్లో నటించిన ‘సుందరకాండ’ జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 23 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రం గత నెల 27న థియేటర్లలో రిలీజైంది.
News September 17, 2025
డీఎస్సీలు అభ్యర్థులకు ఈనెల 19న నియామక పత్రాలు: డీఈవో

అనంతపురం జిల్లాలో డీఎస్సీలో 755 మంది ఉద్యోగాలు సాధించిన సంగతి తెలిసిందే. డీఎస్సీ అభ్యర్థులకు ఈ నెల 19న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు DEO ప్రసాద్ బాబు తెలిపారు. 75 మందిని అమరావతికి తీసుకెళ్లేందుకు 45 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు రేపు ఉదయం 6 గంటలకు అనంతపురంలోని PVKK కళాశాలకు చేరుకోవాలని సూచించారు.