News July 3, 2024
అశ్వారావుపేట ఎస్సైను పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అశ్వరావుపేట ఎస్సై శ్రీరాముల శ్రీనివాసులు బుధవారం బీఆర్ఎస్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఎస్ఐ ఆరోగ్య పరిస్థితిని వారి కుటుంబ సభ్యులను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎస్సైకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన సూచించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు.
Similar News
News January 3, 2026
ఖమ్మం:’ ఓటరు జాబితా మ్యాపింగ్ వేగవంతం చేయాలి’

ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితా–2025 ప్రక్రియలో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. బీఎల్ఓలు రోజుకు 30, సూపర్వైజర్లు 300 ఎంట్రీల చొప్పున లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో ఎటువంటి తప్పులు లేకుండా ఖచ్చితత్వంతో ఉండాలని స్పష్టం చేశారు.
News January 3, 2026
ఖమ్మం: స్కూల్ బస్సు డ్రైవర్లకు ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పరీక్షలు

జిల్లాలో పాఠశాల బస్సు ప్రమాదాల నివారణకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పెనుబల్లి మండలంలో నిన్న స్కూల్ బస్సు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ప్రత్యేక తనిఖీలు చేపట్టి, బస్సులను నిలిపివేసి డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News January 3, 2026
యూరియా నిల్వలు పుష్కలం: కలెక్టర్ అనుదీప్

జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, సాగుదారులు ఆందోళన చెందవద్దుని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శనివారం నాగులవంచ వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. జిల్లాలో ప్రస్తుతం 13,795 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


