News April 7, 2025
అశ్వారావుపేట: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

అశ్వారావుపేట శివారులో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. అశ్వారావుపేటకు చెందిన జీసీసీ రేషన్ డీలర్ భూక్యా కృష్ణ మండలం కావడిగుండ్లలో విధులు ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. ఈక్రమంలో దొంతికుంట సమీపంలో వాగొడ్డుగూడెం వైపు వెళ్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో డీలర్ కృష్ణకు కుడికాలు విరగ్గా వాగొడ్డుగూడెంకు చెందిన నాగరాజు, గంగారంకి చెందిన రాజుకు గాయాలయ్యాయి.
Similar News
News March 2, 2026
LNG ఉత్పత్తిని ఆపేసిన ఖతర్.. ధరలు పెరిగే ఛాన్స్!

ప్రపంచలోనే అతిపెద్దదైన LNG (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ప్లాంట్ అయిన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ (ఖతర్)పై ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో దాడి చేసింది. దీంతో ఖతర్ ఎనర్జీ LNG ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే LNGలో 20% ఖతర్ నుంచే వస్తోంది. దీంతో LNG ధరలు పెరిగే ఛాన్స్ ఉంది.
News March 2, 2026
ఆరోగ్య రక్షణకు ‘వంద రోజుల’ ప్రణాళిక: DMHO

భూపాలపల్లి జిల్లా ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు DMHO డాక్టర్ మధుసూదన్ వెల్లడించారు. సోమవారం జిల్లా కార్యాలయంలో ఆర్బీఎస్కే వైద్యాధికారులు, జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ నెల 4 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుందని తెలిపారు.
News March 2, 2026
పర్యావరణ హితంగా హోళీ జరుపుకోండి: ASF SP

హోళీ పండుగను ప్రకృతి సిద్ధమైన రంగులతో సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా SP నితిక పంత్ ప్రజలకు సూచించారు. రసాయన రంగుల వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని, పర్యావరణ హిత రంగులనే వాడాలని కోరారు. ఇతరుల ఇష్టాయిష్టాలను గౌరవిస్తూ వేడుకలు చేసుకోవాలన్నారు. బలవంతపు చందాలకు పాల్పడినా, నిబంధనలు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలన్నారు.


