News February 19, 2025
‘అసంఘటిత కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేయాలి’

అసంఘటిత కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో టాస్క్ ఫోర్స్ కమిటీ, జిల్లా స్థాయి అమలు కమిటీతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఉన్న 2 లక్షల మంది అసంఘటిత కార్మికులను ఈ -శ్రమ్ పోర్టల్లో నమోదు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News October 17, 2025
ప్రిన్సిపల్ చనిపోయారంటూ ఫేక్ లెటర్.. చివరికి

పరీక్షల వాయిదా కోసం ఇద్దరు విద్యార్థులు బరితెగించారు. MP ఇండోర్ ప్రభుత్వ హోల్కర్ సైన్స్ కాలేజీలో BCA చదువుతున్న వారు కళాశాల లెటర్ హెడ్ సంపాదించారు. ప్రిన్సిపల్ అనామిక హఠాత్తుగా చనిపోయారని, ఈనెల 15,16న జరగాల్సిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాసి SMలో వైరల్ చేశారు. అసలు విషయం బయటపడటంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. కాలేజీ 60రోజులు సస్పెండ్ చేసింది. ఇద్దరికీ మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది.
News October 17, 2025
గోషామహల్: కబ్జాలను తొలగించిన హైడ్రా

ఆసిఫ్నగర్ మండల పరిధిలోని కుల్సుంపూర్ విలేజ్లోని సర్వే నం.50లో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. అశోక్సింగ్ అనే వ్యక్తి ఆక్రమణలో ఉన్న మొత్తం 1.30 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి.. అందులో షెడ్డులు వేసి విగ్రహతయారీదారులకు అద్దెకు ఇస్తున్నట్లు గుర్తించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా చర్యలు చేపట్టింది.
News October 17, 2025
మహిళల కోసం ఇన్ఫోసిస్ కొత్త ప్రోగ్రామ్

కనీసం 6 నెలల కెరీర్ గ్యాప్ వచ్చిన మహిళా నిపుణులకు ఉద్యోగాలిచ్చేందుకు ఇన్ఫోసిన్ ముందుకొచ్చింది. ‘రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ ఇనిషేటివ్’ పేరుతో గత నెల కొత్త రిఫరల్ ప్రోగ్రామ్ను లాంచ్ చేసింది. తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు అర్హులైన మహిళలను రిఫర్ చేయొచ్చు. వారు జాబ్కు ఎంపికైతే లెవెల్-3లో రూ.10వేలు, లెవెల్-4లో రూ.25వేలు, లెవెల్-5లో రూ.35వేలు, లెవెల్ 6లో రూ.50వేల వరకు రివార్డులు అందించనుంది.