News February 21, 2025
అసభ్యకర పోస్టులు పెడితే చర్యలు: మన్యం SP

సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే చర్యలు తప్పవని పార్వతీపురం మన్యం ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి హెచ్చరించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నైతిక, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టేవారిపై చర్యలు చేపడతామన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై ప్రత్యేక టీం ద్వారా నిరంతరం నిఘా ఉందని చెప్పారు. యువత సోషల్ మీడియాను వాడేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
Similar News
News February 24, 2026
జగిత్యాల: అకాల వర్షం.. అన్నదాతకు తీవ్ర నష్టం

నిన్న రాత్రి ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షం మామిడి, మొక్కజొన్న రైతులను దెబ్బతీసింది. రాయికల్ మండలంలోని రామాజీపేటతో పాటు జగిత్యాల గ్రామీణ, సారంగాపూర్ మండలాల్లో మామిడి పిందెలు నేలరాలగా, మొక్కజొన్న పంట నేలవాలింది. ఏళ్ల కష్టమంతా కళ్లముందే నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
News February 24, 2026
జూడోలో ఆదిలాబాద్ జిల్లా క్రీడాకారుల విజయం

సీఎం కప్ 2025-26 జూడోలో ఆదిలాబాద్ క్రీడాకారుల విజయం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. సీఎం కప్ రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన పతకాలు సాధించిన విజేతలను ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల శంకర్ సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జూడో క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
News February 24, 2026
జనగాం: ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి’

జనగామ జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని మాట్లాడుతూ.. ఈనెల 28లోపు రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాల లబ్ధి పొందేందుకు ఈ నమోదు అవసరమని తెలిపారు. ఇంకా నమోదు చేయని రైతులు సమీప వ్యవసాయ కార్యాలయాలు, రైతు వేదికలు, ఏఈవోలు లేదా మీసేవ కేంద్రాలను సంప్రదించాలని కోరారు.


