News July 23, 2024
అసెంబ్లీలో వైసీపీపై కోటంరెడ్డి ఫైర్

మంగళవారం రోజు జరిగిన ఏపీ శాసనసభ సమావేశాల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం దేవరపాడులోని నరసింహకొండ అభివృద్ధికి అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహకారంతో కేంద్ర ప్రభుత్వం నుంచి తను రూ.50 కోట్లు నిధులు తీసుకొస్తే, ఆనాటి సీఎం జగన్ దుర్మార్గంగా ఆ నిధులను ఆపేశారని మండిపడ్డారు.
Similar News
News January 3, 2026
నెల్లూరు: చిన్నారి మృతదేహాన్ని లాక్కొచ్చిన కుక్కలు

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో చిన్నారి <<18745357>>మృతదేహం <<>>శుక్రవారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎస్ఐ నాగార్జున రెడ్డి విచారణ చేపట్టి అసలు విషయాలు వెల్లడించారు. రావురు డొంక గిరిజన కాలనీకి చెందిన వెలుగు జానయ్య 5నెలల కుమారుడు గత నెల 26న అనారోగ్యంతో చనిపోయాడు. మృతదేహాన్ని జగనన్న కాలనీ సమీపంలో తక్కువ లోతు గుంత తీసి పూడ్చారు. కుక్కలు మట్టి తవ్వి మృతదేహాన్ని బయటకు లాక్కొచ్చాయని ఎస్ఐ విచారణలో తేలింది.
News January 3, 2026
నెల్లూరు జిల్లాలో 19 ఉద్యోగాలకు నోటిఫికేషన్

నెల్లూరు జిల్లాలోని KGBVలో 19 బోధనేతర పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటనలో కోరారు. శనివారం నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. అభ్యర్థులు తమ అప్లికేషన్లను నెల్లూరులోని సమగ్రశిక్ష కార్యాలయంలో అందజేయాలని కోరారు.
News January 3, 2026
వ్యవసాయ యాంత్రీకరణకు విరివిగా రుణాలు మంజూరు చేయాలి : కలెక్టర్

వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈనెల 28వ తేదీన వ్యవసాయ యాంత్రీకరణతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు మంజూరు చేస్తున్న రుణాలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.


