News March 15, 2025
అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ స్థానంలో కూనంనేని

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో శనివారం రోజు అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూర్చొని అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై ప్రసంగిస్తున్న సమయంలో ప్రొటెం స్పీకర్ స్థానంలో కూనంనేని ఉండడం పట్ల సీపీఐ నాయకులు, కొత్తగూడెం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 16, 2025
నారపల్లి: పాత నాణేల మాయ.. మోసపోయిన మహిళ

పాత నాణేలు విక్రయిస్తే రూ.లక్షలు వస్తాయని నమ్మబలికి ఓ మహిళను నట్టేట ముంచారు. పోలీసుల ప్రకారం.. పాత నాణేలు విక్రయిస్తే రూ.46 లక్షలు వస్తాయని ఓ మహిళను నమ్మించారు. ప్రాసెసింగ్ ఫీజ్, ట్యాక్స్, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో ఆమె నుంచి ₹1.36 లక్షలు లూటీ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోసపూరిత ప్రకటనలతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
News March 16, 2025
KMM: అనుమానంతో భార్యను, మరొకరిని నరికిన భర్త

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే అనుమానంతో భార్యతో పాటు మరొకరిని భర్త కొడవలితో నరికిన ఘటన ఖమ్మం పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఇద్దరిపై వేటకొడవలితో దాడి చేయగా వారి పరిస్థితి విషమంగా ఉంది. భర్త పరారీలో ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
News March 16, 2025
KMM: అనుమానంతో భార్యను, మరొకరిని నరికిన భర్త

వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే అనుమానంతో భార్యతో పాటు మరొకరిని భర్త కొడవలితో నరికిన ఘటన ఖమ్మం పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. ఇద్దరిపై వేటకొడవలితో దాడి చేయగా వారి పరిస్థితి విషమంగా ఉంది. భర్త పరారీలో ఉన్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.