News February 24, 2025

అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సిక్కోలు ఎమ్మెల్యేలు

image

శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు కింజ‌రాపు అచ్చెన్నాయుడు, గొండు శంకర్, గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, నడుకుదిటి ఈశ్వరరావు, మామిడి గోవిందరావు, బెందాళం అశోక్, కూన రవికుమార్ హాజరయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలపై రేపటి నుంచి సభలో గళం వినిపించడానికి సిద్ధమయ్యారు.

Similar News

News September 17, 2025

నరసన్నపేట: తాగునీటి వెతలు తప్పవా..

image

నరసన్నపేట మేజర్ పంచాయతీలో తాగునీటి వెతలు తీరడం లేదు. ప్రజలు గత రెండు రోజులుగా తాగేనీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామపంచాయతీ అధికారుల నిర్లక్ష్యం ఫలితం వల్లే తాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సరఫరాపై అధికారులు సరైన చర్యలు చేపట్టడం లేదని, పట్టణంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుందని, రోజుల తరబడి తాగునీటికి ప్రజలు ఎదురు చూడడం పరిపాటిగా మారిందని అంటున్నారు.

News September 16, 2025

SKLM: సీఎం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

image

రాష్ట్ర రాజధానిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం నిర్వహించిన సమావేశంలో శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నీల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి పథకాలను సీఎం వివరిస్తూ, ఆయా జిల్లాలలో ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లాస్థాయి అధికారులు పనిచేయాలన్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలలో కొన్నిటిని అమలు చేశామని తెలియజేశారు.

News September 16, 2025

ఇచ్ఛాపురం: అతిథి అధ్యాపక పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానం

image

ఇచ్ఛాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒడియా అతిథి అధ్యాపక పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20వ తేదీ లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 22న ఉదయం 10 గం.లకు ఇంటర్వ్యూ ఉంటుందని, MA (ఒడియా)లో 50% మార్కులు, NET, Ph.D అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.