News February 24, 2025
అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సిక్కోలు ఎమ్మెల్యేలు

శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, గొండు శంకర్, గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, నడుకుదిటి ఈశ్వరరావు, మామిడి గోవిందరావు, బెందాళం అశోక్, కూన రవికుమార్ హాజరయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలపై రేపటి నుంచి సభలో గళం వినిపించడానికి సిద్ధమయ్యారు.
Similar News
News February 25, 2025
పోలీసులు నేత్రాలను సంరక్షించుకోవాలి: ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి

పోలీసులకు కంటి చూపు చాలా ముఖ్యమని,కళ్లపై శ్రద్ధ వహించాలని ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అన్నారు. సోమవారం విజయనగరానికి చెందిన ఓ కంటి ఆసుపత్రి నేతృత్వంలో పోలీసు అధికారులు, సిబ్బందికి కంటి చూపు పరీక్షలు ఎస్పీ కార్యాలయంలో జరిగాయి. మానవ శరీరంలో కళ్లు అనే అవయవాలు చాలా ప్రధానమైనవని చెప్పారు. మన నేత్రాలను పరిరక్షించుకుని బాధ్యత వహించాలని అన్నారు.
News February 24, 2025
చౌకుపేటలో వివాహిత ఆత్మహత్య

సోంపేట మండలం చౌకుపేట గ్రామంలో సోమవారం వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన కౌసల్య రౌలో (30) కుటుంబ సమస్యలు తట్టుకోలేక సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు బారువా ఎస్ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 24, 2025
SKLM: ఎన్నికల విధులపట్ల అప్రమత్తంగా ఉండాలి

ఉపాధ్యాయ MLC ఎన్నికల విధులపట్ల సంబంధిత పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సహాయ ఎన్నికల అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం జెడ్పీ మందిరంలో ఈనెల 27న ఉపాధ్యాయ MLC ఎన్నికల సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పీవో, ఎపీవోలకు రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలో విధులు, పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు.