News February 24, 2025
అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సిక్కోలు ఎమ్మెల్యేలు

శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, గొండు శంకర్, గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, నడుకుదిటి ఈశ్వరరావు, మామిడి గోవిందరావు, బెందాళం అశోక్, కూన రవికుమార్ హాజరయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలపై రేపటి నుంచి సభలో గళం వినిపించడానికి సిద్ధమయ్యారు.
Similar News
News March 27, 2025
పొందూరు: రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

పొందూరు- దూసి రైల్వే స్టేషన్ల మధ్య గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు. ప్రయాణిస్తున్న రైలు నుంచి జారిపడి పడడంతో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నట్టు తెలిపారు. మృతుని వయస్సు 35 సంవత్సరాలు ఉండి, ఎరుపు రంగు షార్ట్, తెలుపు రంగు బనియన్ ధరించినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసినవారు ఎస్ఐ నెంబర్ 9493474582ను సంప్రదించాలన్నారు.
News March 27, 2025
పలాస: పెళ్లయినా 50 రోజులకు యువకుడి మృతి

పలాసలోని మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా యువకుడు పెళ్లయిన 50 రోజులకు మృతి చెందినట్లు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు. మండలంలోని గొల్లమాకన్నపల్లికి చెందిన మధు(28) సింగుపురానికి చెందిన ఓ యువతని ప్రేమించి ఫిబ్రవరి 9న పెళ్లి చేసుకున్నాడు. మంగళవారం రాత్రి కోసంగిపురం ప్లై ఓవర్ వద్ద బైక్ అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 27, 2025
టెక్కలి: ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతి

టెక్కలి మండలం చల్లపేట గ్రామానికి చెందిన హనుమంతు కృష్ణారావు(62) అనే వ్యక్తి మంగళవారం రాత్రి పురుగులమందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. తొలుత టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. బుధవారం రాత్రి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు. మృతునికి భార్య భానమ్మ ఉన్నారు.