News March 6, 2025

ఆందోలు: ఉద్యోగులు సమయపాలన పాటించాలి: మంత్రి

image

వైద్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్ మొదలుకొని డాక్టర్ వరకు ప్రతి ఒక్కరు సమయానికి విధులు నిర్వహించాలని చెప్పారు. సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రులను తాను తనిఖీ చేస్తానని పేర్కొన్నారు.

Similar News

News November 1, 2025

పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా? థైరాయిడ్ కావొచ్చు

image

ప్రస్తుతం థైరాయిడ్ వ్యాధి పిల్లలకు కూడా వస్తోంది. పిల్లల్లో ఈ సమస్యను నివారించాలంటే లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. పిల్లలు అలసిపోయినట్లు అనిపించడం, తరచూ అనారోగ్యానికి గురికావడం, చర్మం, పొడిగా, నిర్జీవంగా మారడం, మలబద్ధకం, అజీర్ణం, థైరాయిడ్ గ్రంధి పరిమాణం పెరగడం, కళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

News November 1, 2025

రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలకు విద్యార్థి ఎంపిక

image

వాల్మీకిపురం మండలం కొత్త మంచూరు ఉన్నత పాఠశాలలో ఇటీవల నిర్వహించిన ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి నెట్ బాల్ సెలక్షన్స్‌లో మదనపల్లె విద్యార్థి సత్తాచాటాడు. U-17 విభాగం నెట్ బాల్ పోటీల్లో మదనపల్లెలోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థి వెంకట విశ్వ సాయి ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడని పీడీ రెడ్డి వరప్రసాద్ శుక్రవారం తెలిపారు. ప్రతిభ చూపిన విద్యార్థిని హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.

News November 1, 2025

కేశినేని చిన్ని VS కొలికపూడి.. చంద్రబాబు ఆగ్రహం

image

AP: MP కేశినేని చిన్ని, MLA కొలికపూడి మధ్య <<18088401>>విభేదాలపై<<>> CM CBN మండిపడ్డారు. వారి నుంచి వివరణ తీసుకుని తనకు నివేదిక ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని ఆదేశించారు. ‘పార్టీ నేతలు ఇలా ఆరోపణలు చేసుకోవడం ఎప్పుడూ జరగలేదు. పార్టీ టికెట్ ఇస్తేనే గెలిచామని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ సిద్ధాంతాల గురించి తెలియని వారికి, పొలిటికల్ అనుభవం లేని వారికి టికెట్లిచ్చి తొందరపడ్డానేమో’ అని పార్టీ నేతలతో వ్యాఖ్యానించారు.