News March 6, 2025

ఆందోలు: ఉద్యోగులు సమయపాలన పాటించాలి: మంత్రి

image

వైద్య శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్ మొదలుకొని డాక్టర్ వరకు ప్రతి ఒక్కరు సమయానికి విధులు నిర్వహించాలని చెప్పారు. సమయపాలన పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రులను తాను తనిఖీ చేస్తానని పేర్కొన్నారు.

Similar News

News February 8, 2026

జగిత్యాల: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

image

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచార గడువు ముగిసిన అనంతరం సంబంధిత మున్సిపల్ పరిధిలో ఓటరు కాని వ్యక్తులు ఎవరూ ఉండరాదని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ కార్యకర్తలు, మద్దతుదారులు తక్షణమే ప్రాంతాన్ని విడిచిపెట్టాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డబ్బు, మద్యం, బహుమతుల పంపిణీపై ‘జీరో టాలరెన్స్’ విధానం అమలు చేస్తామని అన్నారు.

News February 8, 2026

MNCL: తండ్రుల కోసం తనయుల ఆరాటం!

image

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, BRS మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుల తనయులు మున్సిపల్ ఎన్నికల్లో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. తండ్రులకు అండగా ఉంటూ ఎమ్మెల్యే PSR తనయుడు చరణ్, మాజీ ఎమ్మెల్యే కుమారుడు విజిత్ రావు తమ పార్టీ అభ్యర్థుల గెలుపును భుజస్కందాలపై వేసుకొని ఇంటింటా ప్రచారాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వీరు రాజకీయ ప్రత్యర్థులుగా ఉండవచ్చు.

News February 8, 2026

ఏలూరు: వాషింగ్ మిషన్‌లో దూరిన నాగుపాము

image

జంగారెడ్డిగూడెంలో రోటరీ క్లబ్ సమీపంలోని చిన్నం సుబ్బారావు నివాసంలో ఆదివారం వాషింగ్ మిషన్‌లో నాగుపాము కలకలం రేపింది. బట్టలు వేసేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులకు బుసలు వినిపించడంతో పరిశీలించగా పాము కనిపించింది. వెంటనే స్నేక్ సేవియర్ సొసైటీకి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పామును చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.