News February 10, 2025
ఆందోల్: మంజీరా నదిలో దూకి వ్యక్తి మృతి

చిలిపిచేడ్ మండలం చిట్కుల్ మంజీరా నదిలో దూకి గల్లంతైన వ్యక్తి మృతదేహాన్ని అధికారులు బయటకు తీశారు. చండూరు గ్రామానికి చెందిన రమేష్ సోమవారం ఉదయం మంజీరా నదిలో దూకగా విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి మృతదేహాన్ని వెలికి తీశారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 11, 2026
అసెంబ్లీలో విశాఖ, అనకాపల్లి సమస్యలపై గళం వినిపిస్తారా?

నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో విశాఖ, అనకాపల్లి MLAలు పాల్గొననున్నారు. జిల్లాల్లో నీటి సరఫరా, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ సమస్యలు, మెట్రో, RINL, గోవాడ షుగర్ ఫ్యాక్టరీ సమస్యలు, పారిశ్రామిక వాడల్లో ప్రమాదాలు, జాతీయ-రాష్ట్ర రహదారుల కనెక్టివిటీ, రవాణా సౌకర్యాల లోపాలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. బడ్జెట్లో ఈ సమస్యలను తీర్చేందుకు నిధులు కేటాయించేలా మన MLAలు గళం విప్పాలని ప్రజలు కోరుతున్నారు.
News February 11, 2026
నెల్లూరు: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

నెల్లూరు జిల్లాలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. భవిష్యత్తులో 10 మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం. అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికే ఫీజు చెల్లించిన విద్యార్థులు మీ వివరాల్లో తప్పులు ఉంటే రేపటి(FEB 12) లోగా సరిచేసుకోవాలి. HMలను సంప్రదించి విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు, కులం, ఫొటో, సంతకం మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ మార్చడం వీలుండదని అధికారులు తెలిపారు.
News February 11, 2026
ఆసిఫాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

బెజ్జూర్ మండలం హేటిగూడ గ్రామంలో ఓ శుభకార్యానికి వచ్చిన వారు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా అభిరామ్(6) సోమవారం మృతిచెందగా నగోశ్ మొండి (17) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో వ్యక్తి వడాయి మోహన్ ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎస్సై సర్తాజ్ పాషా కేసు నమోదు చేశారు.


