News July 3, 2024

ఆందోల్: విద్యుదాఘాతంతో లైన్ మెన్ మృతి

image

విద్యుత్ మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుదాఘాతంతో లైన్​మెన్​ మృతి చెందిన ఘటన ఆందోల్ మండలం ఎర్రారంలో జరిగింది. స్థానికుల వివరాలు.. పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటకు చెందిన లైన్ మెన్ చంద్రశేఖర్, మరో లైన్ మెన్ విద్యుత్ లైన్‌‌ను బాగు చేస్తున్నారు. ఒక్కసారిగా విద్యుత్ సరఫరా జరగగా చంద్రశేఖర్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 

Similar News

News October 2, 2024

MDK: మాంసం విషయంలో తగ్గేదే లేదంటున్నా జనం.!

image

బుధవారం పెత్రమాస అవడంతో ప్రజలు కౌసుపై మక్కువ చూపుతారు. కానీ ఈ సంవత్సరం పెత్రమాసతో పాటు గాంధీ జయంతి రావడంతో అధికారులు జీవహింస చేయరాదని సూచించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్ని పట్టణాల్లో ఉ.4 గంటలకు మటన్ షాపులు ఓపెన్ చేసి మటన్ అమ్మారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉ.3 గంటలకె మేకలు, గొర్రెలను కోశారు. పెద్దలకు నైవేద్యంగా పెట్టే మాంసాన్ని ఆచార సంప్రదాయాన్ని మరువలేమని పలువురు అన్నారు.

News October 2, 2024

MDK: పల్లెల్లో బతుకమ్మ పండుగ సందడి

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో బతుకమ్మ, దసరా పండుగ సందడి మొదలైంది. రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో ఈరోజు పాఠశాలల్లో బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులు హాస్టల్ నుంచి స్వగ్రామాలకు వెళ్తుండడంతో రద్దీగా ఏర్పడింది. గ్రామాల్లో బతుకమ్మ పండుగ పురస్కరించుకొని తంగేడు, గునుగు, వివిధ రకాల పూల సేకరణలో నిమగ్నమయ్యారు.

News October 1, 2024

MDK: పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు..!

image

సంవత్సరానికి ఒక్కసారి పెద్దలకు నైవేద్యం పెట్టుకునే పెత్తర అమావాస్యకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అదే రోజు గాంధీ జయంతితోపాటు మాంసాహారం, మందు షాపులు బంద్ కానున్నాయి. దీంతో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ప్రజలు పెత్తర అమావాస్య జరుపుకునేది ఎట్లా అనే ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పెత్తర అమావాస్యను కొందరు మంగళవారం లేదా గురువారం చేసుకోవడానికి ఆసక్తి చూపగా, పంతుళ్లు మాత్రం మంగళవారమే చేసుకోవాలని అంటున్నారట.