News March 13, 2025
ఆంధ్రప్రదేశ్-తెలంగాణను కలిపే వంతెనపై ప్రజల్లో ఆశాభావం

అమ్రాబాద్-పదర మండలాలను కలిపే కృష్ణా నదిపై వంతెన నిర్మాణం నల్లమల ప్రజలకు దశాబ్దాల కల. మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి దేవస్థానం సమీపంలో ఈ వంతెన నిర్మాణం జరిగితే, వాణిజ్య, వ్యవసాయ, పర్యాటక రంగాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు భావిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రస్తావన వచ్చినా అమలు కాలేదు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి స్వస్థలం NGKL జిల్లా కావడంతో, 30ఏళ్ల కల నెరవేరుతుందన్న ఆశ ప్రజల్లో వ్యక్తమౌతోంది.
Similar News
News December 1, 2025
కౌన్సిల్ సమావేశంలో అందెశ్రీకి నివాళి

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాలులో నిర్వహించిన సమావేశంలో ప్రముఖ కవి, రచయిత అందెశ్రీకి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యేలు, మేయర్, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు రెండు నిమిషాలు మౌనం పాటించారు. తెలంగాణ సాహిత్యానికి ఆయన మరణం తీరని లోటు అని నేతలు పేర్కొన్నారు.
News December 1, 2025
గీసు’కొండ’లో రెండు కాంగ్రెస్ల మధ్య పోటీ!

కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నెలకొంది. కానీ వరంగల్ జిల్లాలో కొండా కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు మధ్య తీవ్రంగా పోటీ పడుతున్నాయి. జిల్లాలో ఎక్కడ లేని విధంగా గీసుగొండలో అధికార పార్టీలో రెండు గ్రూపుల చిచ్చు తీవ్ర స్థాయికి చేరింది. పంచాయతీ ఎన్నికల్లో గీసుగొండలో బీఆర్ఎస్ సైడ్ అయి, రెండు కాంగ్రెస్ల అభ్యర్థుల మధ్యే పోటీ జరుగుతోందని ప్రచారం అవుతోంది.
News December 1, 2025
చొప్పరివారిగూడెం సర్పంచ్ ఏకగ్రీవం

నల్గొండ జిల్లా చండూరు మండలం చొప్పరివారిగూడెం సర్పంచ్గా జాల వెంకన్నను గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనకు కల్పించిన గౌరవానికి ఆయన సంతోషించి, గ్రామ అభివృద్ధికి తన వంతుగా రూ.18.16 లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఏకగ్రీవ ఎన్నికల సంప్రదాయాన్ని కొనసాగించడంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు ఆయనను అభినందించారు.


