News April 11, 2024
ఆకట్టుకున్న ఈద్ ముబారక్ సైకత శిల్పం
ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం సమీపంలో బుధవారం శిల్పి గేదెల హరికృష్ణ నిర్మించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఈ సైకత శిల్పం చేసినట్లు ఆయన చెప్పారు. పలువురు ముస్లిం సోదరులకు తన సైకత శిల్పం ద్వారా ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. శిల్పి హరికృష్ణ నైపుణ్యాన్ని పలువురు అభినందించారు
Similar News
News September 30, 2024
అరసవెల్లి ఆలయంలో సూర్యకిరణ దర్శనం
అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ఉత్తరాయణ, దక్షిణాయణ కాలమార్పుల్లో భాగంగా తొలి సూర్యకిరణాలు నేరుగా మూలవిరాట్టును తాకనున్నాయి. ఆ అరుదైన క్షణాలు అక్టోబర్ 1, 2 తేదీల్లో సాక్షాత్కరించనున్నాయని EO భద్రాజీ ఆదివారం తెలిపారు. సూర్యోదయ సమయంలో నేరుగా సూర్యకిరణాలు గర్భాలయంలోని స్వామి వారి మూలవిరాట్టును తాకడం ఇక్కడి క్షేత్ర మహత్యంగా చెబుతుంటారు. భక్తులు దర్శించుకోవాలని కోరారు.
News September 30, 2024
సారవకోట: అత్యాచార కేసులో నిందితుడి అరెస్ట్
సారవకోట మండలంలో ఓ గ్రామానికి చెందిన 9వ తరగతి బాలికపై అత్యాచారం చేసిన కేసులో అదే ప్రాంతానికి చెందిన బుద్దల హేమసుందరరావును శనివారం రాత్రి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శ్రీకాకుళం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రాజశేఖర్ విచారణ చేశారన్నారు. యువకుడి అరెస్ట్ అనంతరం పాతపట్నం కోర్టులో హాజరు పర్చగా రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.
News September 29, 2024
శ్రీకాకుళం: హోంమంత్రిని కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్
భారత విమానయాన రంగ పురోగతిపై సమీక్షించడంతో పాటు పలు అంశాలపై చర్చిండానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం ఢీల్లిలో సమావేశం అయ్యారు. ఈ మెరకు శ్రీకాకుళం నగరంలోని కేంద్రమంత్రి క్యాంపు కార్యాలయము నుంచి ఓ ప్రకటనను విడుదల చేశారు. భారత విమానయాన రంగ పురోగతిపై పూర్తిస్థాయిలో సహకరిస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారని ప్రకటనలో పేర్కొన్నారు.