News April 11, 2024

ఆకట్టుకున్న ఈద్ ముబారక్ సైకత శిల్పం

image

ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయం సమీపంలో బుధవారం శిల్పి గేదెల హరికృష్ణ నిర్మించిన సైకత శిల్పం పలువురిని ఆకట్టుకుంది. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ఈ సైకత శిల్పం చేసినట్లు ఆయన చెప్పారు. పలువురు ముస్లిం సోదరులకు తన సైకత శిల్పం ద్వారా ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. శిల్పి హరికృష్ణ నైపుణ్యాన్ని పలువురు అభినందించారు

Similar News

News March 14, 2026

1,462 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశాం: శ్రీకాకుళం కలెక్టర్

image

జిల్లాలో ప్రాథమిక స్థాయి అక్షరాస్యత పరీక్షలు 1,13,102 మంది మార్చి 15వ తేదీన రాయనున్నారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు సమన్వయంతో పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలన్నారు. అభ్యాసకులకు అన్ని మండల, మున్సిపాలిటీ, గ్రామ వార్డుల పరిధిలో ఉన్న ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో 1,462 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

News March 14, 2026

విధులు నిర్వాహణలో నిర్లక్ష్యం వహించరాదు: SKLM కలెక్టర్

image

విధులు నిర్వాహణలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పైపులైన్ కనెక్షన్లుపై ఎమినిటి సెక్రటరీస్, మున్సిపల్ అధికారులతో శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. నగరంలో జరుగుతున్న డ్రైనేజీ పనులు, మంచినీటి పైపులైన్లు పనుల్లో ఎక్కడ రాజీ పడకుండా వేగవంతం చేయాలని ఆదేశించారు. అధికారులు అలసత్వంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.

News March 14, 2026

సిక్కోలు దొర..సేవలు మరువలేం

image

మారుమూల గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి సిక్కోలు జిల్లాకు పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చిన హనుమంతు జగన్నాథ దొర మన ప్రాంత వాసి కావడం గర్వకారణం.1943లో కోటబొమ్మాళి(M) జర్జంగిలో జన్మించిన హెచ్. జె.దొర పోలీసు శాఖలో 40 ఏళ్లుగా పని చేశారు. స్వగ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి కళ్యాణమండపం, శివాలయాన్ని నిర్మించారు. సొంత ఇంటిని వృత్తి విద్యా శిక్షణా కేంద్రంగా మార్చి నిరుద్యోగులకు బాసటగా నిలిచారు.