News July 10, 2024

ఆకాశవాణిలో ‘జంధ్యాల’ ధార్మిక బాణి

image

కేంద్రప్రభుత్వ నిర్వహణలోని శ్రేష్ఠ భారత్ కార్యక్రమాల్లో భాగంగా, సిక్కు సంప్రదాయ గురువుల గురించిన పది భాగాల ధారావాహికను విశాఖ ఆకాశవాణి రేడియో స్టేషన్ ప్రసారం చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే శ్రీకాకుళం రచయిత జంధ్యాల శరత్ బాబు ప్రసంగాల పరంపరను రికార్డు చేసింది. ఆ ధార్మిక ఉపన్యాసాలు వచ్చే ఆదివారం నుంచి సాయంత్రం వేళల్లో మొదలై, ప్రతీ వారం రెండున్నర నెలలపాటు ఉంటాయని ఏఐఆర్ ఉన్నతాధికారులు ప్రకటించారు.

Similar News

News December 8, 2025

బాల్యవివాహాలు నిర్మూలన మనందరి బాధ్యత: కలెక్టర్

image

బాల్య వివాహాల నిర్మూలన మనందరి బాధ్యతని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంబంధిత వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బాల్య వివాహాల రహిత భారత దేశంగా ముందుకు నడిపించేందుకు అందరి వంతు కృషి అవసరం అన్నారు. బాల్యవివాహాల వలన ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయి అని ఆయన తెలియజేశారు. జిల్లాస్థాయి అధికారులు ఉన్నారు.

News December 8, 2025

శ్రీకాకుళం: ‘ధాన్యాన్ని అధనంగా తీసుకుంటున్నారు’

image

ధాన్యం కొనుగోళ్లలో కొనుగోలు కేంద్రాల వద్ద 3 నుంచి 5 కేజీలు అధనంగా రైతుల నుంచి మిల్లర్లు తీసుకుంటున్నారని ఏపీ రైతు సంఘం పీజీఆర్ఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేసింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతి పత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని ప్రసాదరావు, చందర్రావు అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అధికారులు అమలు చేయాలని కోరారు.

News December 8, 2025

9 వరకు టెన్త్ ఫీజు చెల్లింపు గడువు పెంపు SKLM DEO

image

ఎటువంటి అపరాదరుసుం లేకుండా డిసెంబర్ 9 వరకు టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించవచ్చని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు సోమవారం తెలిపారు. రూ.50 ఫైన్‌తో 10 నుంచి 12 వరకు, రూ.200 ఫైన్‌తో 13 నుంచి 15 వరకు, రూ.500 ఫైన్‌తో 16 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు సమాచారం తెలియజేశామన్నారు.