News March 21, 2025

ఆకివీడు: స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు మృతి

image

ఆకివీడు మండలం చిన కాపవరంలోని వయ్యేరు కాలువలో శుక్రవారం స్నానానికి దిగిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. 5వ తరగతి చదువుతున్న పడికౌరు శరత్‌కుమార్ (10) కటారి పవన్ సాయి (10)లు మధ్యాహ్నం సమయంలో ఈతకొట్టేందుకు కాలువలోకి దిగారు. ఇద్దరు ఒక్కసారిగా కాలువలో మునిగిపోయారు. వీరి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Similar News

News October 17, 2025

రాష్ట్రస్థాయి పోటీలకు 42 మంది విద్యార్థులు ఎంపిక

image

ఉమ్మడి ప.గో జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడల్లో తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా జూనియర్‌ కళాశాలకు చెందిన 42 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గత నెల 12 నుంచి ఈనెల 15 వరకు అండర్‌-19 విభాగంలో వీరంతా ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్‌ భూపతిరాజు హిమబిందు తెలిపారు. గురువారం కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల కరస్పాండెంట్‌ చిట్టూరి సత్యఉషారాణి అభినందించారు.

News October 17, 2025

‘కార్తీక మాసంలో పర్యాటకులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి’

image

కార్తీక మాసంలో పేరుపాలెం బీచ్‌కు వచ్చే పర్యాటకులకు ఆయా శాఖల అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని నర్సాపురం ఆర్డీవో దాసిరాజు అధికారులకు సూచించారు. గురువారం కేపీపాలెం బీచ్ వద్ద కార్తీక మాస ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బీచ్‌లో యాత్రికులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీపీఓ, డీఎల్‌పీఓ, ఎమ్మార్వో తదితర అధికారులు పాల్గొన్నారు.

News October 16, 2025

తణుకు: బీజేపీ జాతీయ మీడియా అధికార ప్రతినిధిగా రేణుక

image

తణుకునకు చెందిన ముళ్లపూడి రేణుక బీజేపీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి నుంచి జాతీయ మీడియా ప్రతినిధిగా, రాష్ట్ర బీజేపీ మీడియా అధికార ప్రతినిధిగా పాలకొల్లుకు చెందిన ఉన్నమట్ల కభర్దిలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ బుధవారం నియమించారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు ఇరువురు నాయకులను అభినందించారు.