News March 13, 2025
ఆక్రమణలకు గుర్తింపు పొందేందుకు ఉత్వర్వులు: కలెక్టర్

ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ది 15.10.2019 లోపు ఇళ్లు నిర్మించుకొని ఉన్న ఆక్రమణలకు గుర్తింపు పొందుటకు ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చారని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అర్హత గల ఆక్రమణదారులు వారి ఇళ్లను క్రమబద్ధీకరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తును ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. 31 డిసెంబర్ 2025 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Similar News
News November 6, 2025
గద్వాల్: నేడు నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు ప్రక్రియ

రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల యజమానులు తలపెట్టిన సిసిఐ కొనుగోళ్ల బంద్ ను ఉపసంహరించుకోవడం జరిగిందని కలెక్టర్ సంతోష్ గురువారం తెలిపారు. అందులో గద్వాల జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి యథావిధిగా పత్తి కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.
News November 6, 2025
మాలేపాటి కుటుంబానికి లోకేశ్ పరామర్శ

దగదర్తిలోని మాలేపాటి నివాసానికి మంత్రి నారా లోకేశ్ చేరుకున్నారు. సుబ్బానాయుడు, భాను చిత్రపటాలకు మంత్రి నివాళులు అర్పించారు. అనంతరం మాలేపాటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ధైరంగా ఉండాలని సూచించారు. టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని లోకేశ్ భరోసా ఇచ్చారు. లోకేశ్ వెంట నెల్లూరు జిల్లా MLAలు ఉన్నారు.
News November 6, 2025
విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ జానకి రామయ్య మృతి

విజయ డెయిరీ మాజీ ఛైర్మన్ మండవ జానకి రామయ్య (93) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం గన్నవరం శివారు రుషి వాటిక వృద్ధుల నిలయంలో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం విజయ డెయిరీ ఛైర్మన్గా సేవలందించిన మండవ, పాడి రైతుల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేశారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.


