News March 13, 2025
ఆక్రమణలకు గుర్తింపు పొందేందుకు ఉత్వర్వులు: కలెక్టర్

ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ది 15.10.2019 లోపు ఇళ్లు నిర్మించుకొని ఉన్న ఆక్రమణలకు గుర్తింపు పొందుటకు ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చారని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అర్హత గల ఆక్రమణదారులు వారి ఇళ్లను క్రమబద్ధీకరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తును ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా తెలిపారు. 31 డిసెంబర్ 2025 లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
Similar News
News March 21, 2025
జగిత్యాల జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లాలో ఎండలు కాస్త తగ్గాయి. గురువారం జైన, జగ్గసాగర్ 38℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు మన్నెగూడెం 37.9, అల్లీపూర్, పెగడపల్లె 37.8, సారంగాపూర్ 37.6, మేడిపల్లె, మల్లాపూర్ 37.5, మారేడుపల్లి 37.4, రాయికల్ 37.1, వెల్గటూర్, జగిత్యాల 37, నేరెల్లా, కొల్వాయి 36.9, ఐలాపూర్ 36.9, గొల్లపల్లె 36.7, సిరికొండ 36.5, గుల్లకోటలో 36.2℃ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో గురువారం జిల్లాలో కాస్త చల్లటి వాతావరణం నెలకొంది.
News March 21, 2025
నెల్లూరు: ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలకు నోటిఫికేషన్

నెల్లూరు జిల్లాలో ఖాళీ అయిన విడవలూరు ఎంపీపీ, దగదర్తి వైస్ ఎంపీపీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ZP సీఈవో విద్యారమ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికకు సంబంధించి ముందస్తుగా ఈ నెల 23వ తేదీలోగా సభ్యులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. ఈనెల 27వ తేదీ ఉదయం 11 గంటలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు ఆయా మండలాల ఎంపీడీవోలకు ఆదేశాలు జారీచేశామన్నారు.
News March 21, 2025
మాచవరంలో మహిళ దారుణ హత్య

మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పని చేస్తున్న సీతారత్నం (61) ను అతి దారుణంగా కొట్టడంతో తలకు తీవ్రమైన గాయమై మృతి చెందింది. మాచవరం PHCలో పనిచేస్తున్న సూపర్వైజర్ శ్రీనివాసరావుకు సీతారత్నంకు కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. డబ్బులు విషయంలో వీరిద్దరి మధ్య గొడవ కావడంతో ఈ హత్య జరిగినట్లు పిడుగురాళ్ల సీఐ వెంకటరావు తెలిపారు.