News February 1, 2025

ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ: హోం మంత్రి అనిత

image

రాష్ట్రంలో అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు కూటమి ప్రభుత్వం విధివిధానాలను ఖరారు చేసినట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత శుక్రవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. 2019 అక్టోబర్ 15వ తేదీ కంటే ముందున్న వాటికి వర్తింప చేయనున్నట్లు తెలిపారు. గతంలో జారీచేసిన ఉత్తర్వులను పక్కన పెడుతూ కొత్తగా జీఓ నంబర్ 30 జారీ చేసినట్లు వివరించారు. 150 గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరణ జరుగుతుందన్నారు.

Similar News

News October 19, 2025

ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో పొన్నూరు ఎమ్మెల్యే భేటీ

image

సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నాయుడుపేట పట్టణంలోని ఆమె నివాసంలో గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే, సంగం మిల్క్ డైరీ చైర్మన్ దూళిపాళ్ల నరేంద్ర శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సంగం డైరీ మేనకూరు సెజ్ పరిసర ప్రాంతంలో ఏర్పాటు అవుతుండగా ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలపై ఇరువురు ఎమ్మెల్యేలు చర్చించుకున్నారు. సంగం డైరీ రైతులకు, పాల ఉత్పత్తిదారులకు ఆశాకిరణమని ధూళిపాల నరేంద్ర తెలిపారు.

News October 19, 2025

నెల్లూరు జనసేన వివాదంపై త్వరలో విచారణ!

image

నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఇటీవల ఏర్పడిన వివాదాలపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీరియస్‌గా దృష్టి సారించారు. జిల్లా ముఖ్య నేత, టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్‌పై కొందరు నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు. పార్టీ సీనియర్ నాయకులను కాదని వైసీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని అధినేత దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పార్టీ రాష్ట్ర MSME ఛైర్మన్ శివశంకర్‌ను విచారణకు పంపనున్నారు.

News October 19, 2025

శ్రీకాకుళం: తహశీల్దార్‌ను తొలగించాలని ఆందోళన

image

ఓ బీసీ మహిళను కొత్తూరు తహశీల్దార్ కె.బాలకృష్ణ మానసికంగా వేధిస్తున్నారని.. ఆయనను వెంటనే విధుల నుంచి తొలగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ జిల్లా అధ్యక్షుడు కూటికుప్పల నరేశ్ కుమార్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద బీసీ సంఘాల నాయకులు శనివారం ఆందోళన చేశారు. ఇంటి స్థలం పొజిషన్ సర్టిఫికెట్ కోసం రూ.30వేలు లంచం ఇవ్వాలని, లేకపోతే తనతో ఒక రోజు గడపాలని తహశీల్దార్ కోరడం దురదృష్టకరమన్నారు.