News August 9, 2024
ఆగష్టు 15న అన్న క్యాంటీన్లు ప్రారంభం: కలెక్టర్ సృజన

ఆగష్టు 15వ తేదీ నుంచి నిరుపేదలకు తక్కువ ధరకే భోజనాన్ని అందించే అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. విజయవాడలో అన్న క్యాంటీన్లను శుక్రవారం కలెక్టర్ సృజన, నగరపాలక సంస్థ కమీషనర్ ధ్యానచంద్ర, ఆర్డీవో భవానీ శంకరీలతో కలిసి కలెక్టర్ స్వయంగా పర్యటించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
Similar News
News October 27, 2025
కృష్ణా: మెంథా తుఫాన్.. ప్రత్యేక అధికారులు జాబితా ఇదే.!

మచిలీపట్నం-7093930106, అవనిగడ్డ-9704701900, కోడూరు-9490952125, నాగయలంక-8639226587, చల్లపల్లి-9100084656, కృత్తివెన్ను-8331056798, మోపిదేవి-8008772233, బంటుమిల్లి-9100109179, ఘంటసాల-9848933877, గూడూరు-9849588941, పెడన-9154409536, బాపులపాడు-9849906009, గన్నవరం-8333991288, గుడివాడ-8686935686, గుడ్లవల్లేరు-9052852666, తోట్లవల్లూరు-9492555104, ఉయ్యూరు-7995086773, నందివాడ-9989092288.
News October 27, 2025
కృష్ణా: తీరప్రాంత ప్రజలకు మడ అడవులు రక్షణ కవచం.!

ప్రకృతి విపత్తుల నుంచి తీరప్రాంత ప్రజలకు రక్షణ కవచంలా మడ అడవులు వ్యవహరిస్తున్నాయి. అలాంటి సహజ సంపద నేడు అంతరించిపోతున్న స్థితికి చేరుకోవడంతో తీరప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. 1977లో దివిసీమ ఉప్పెన సమయంలో మడ అడవులు ఉన్న ప్రాంతాల్లో విపత్తు ప్రభావం తక్కువగా కనిపించిందని, అదేవిధంగా 2004 సునామీ సమయంలో కూడా ఈ మడ అడవులే సహజ రక్షణగా నిలిచాయని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు గుర్తు చేస్తున్నారు.
News October 27, 2025
కృష్ణా: తుపాన్ బీభత్సం.. చిగురుటాకులా వణికిన దివిసీమ

‘మొంథా’ తుపాన్ ప్రభావం వల్ల దివిసీమ ప్రజలు కలవరపడుతున్నారు. గతంలో కృష్ణా జిల్లాను కకావికలం చేసిన 1977 తుపానును గుర్తుచేసుకుంటున్నారు. దీంతో దివిసీమ చిగురుటాకులా వణుకుతోంది. ఆ సంవత్సరం నవంబర్ 19న తుపాను భారతదేశపు తూర్పు సముద్రతీరాన్ని తాకింది. అధికారికంగా 14,204, అనధికారికంగా సుమారు 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. కొన్ని ఊర్లు సముద్రంలో కలిసిపోయాయి.


