News August 9, 2024
ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ: డిప్యూటీ సీఎం భట్టి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. రుణమాఫీ కానీ రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇది రైతుల ప్రభుత్వమని అందరికి రుణమాఫీ చేస్తామన్నారు. ప్రతిపక్షాలు పనికిమాలిన ఆరోపణ చేస్తున్నాయని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.
Similar News
News April 11, 2026
ఏఐ సాంకేతికతతో ఆదాయ వృద్ధి: భట్టి విక్రమార్క

మైనింగ్, రవాణా శాఖల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ఆదాయాన్ని పెంచేందుకు ‘ఏఐ’ సాంకేతికతను వినియోగించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమన్నారు. గత 3 నెలల్లో జీఎస్టీ ఆదాయం 15 శాతం పెరగడంపై హర్షం వ్యక్తం చేశారు.
News April 11, 2026
నెలాఖరుకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లు సిద్ధం చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఈ నెలాఖరుకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. ఏప్రిల్ 30 నాటికి లక్ష్యాన్ని చేరుకునేలా వారాల వారీ ప్రణాళికతో పనులు పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందిస్తూ, పెండింగ్లో ఉన్న నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పనుల్లో జాప్యం వహించవద్దని స్పష్టం చేశారు.
News April 11, 2026
నెలాఖరుకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లు సిద్ధం చేయాలి: కలెక్టర్

జిల్లాలో ఈ నెలాఖరుకు 10 వేల ఇందిరమ్మ ఇళ్లను గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. ఏప్రిల్ 30 నాటికి లక్ష్యాన్ని చేరుకునేలా వారాల వారీ ప్రణాళికతో పనులు పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందిస్తూ, పెండింగ్లో ఉన్న నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. పనుల్లో జాప్యం వహించవద్దని స్పష్టం చేశారు.


