News August 14, 2024
ఆగస్టు 15: హైదరాబాద్లో హై అలర్ట్

పంద్రాగస్టు నేపథ్యంలో నగరంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆంక్షలు విధించారు. జంటనగరాల్లో కీలకమైన సికింద్రాబాద్లోనూ నిఘా పెంచారు. మంగళవారం రాత్రి మార్కెట్ పోలీసులు పలు ప్రాంతాల్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇన్స్పెక్టర్ రాఘవేందర్ ఆధ్వర్యంలో 31 బస్టాప్ తదితర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులను అపి సోదాలు చేశారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
Similar News
News October 31, 2025
HYD: అజహరుద్దీన్ ప్రస్థానం ఇదే!

రాజ్ భవన్లో మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. భారత్ క్రికెట్ జట్టు సారథిగా వ్యవహరించిన అజహరుద్దీన్ 1963 ఫిబ్రవరి 8న HYDలో జన్మించారు. అబిడ్స్లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పాఠశాల విద్య, నిజాం కాలేజీలో బీకాం అభ్యసించారు. 2009లో అజహరుద్దీన్ కాంగ్రెస్లో చేరి, యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.
News October 30, 2025
RR : రేషన్ బియ్యం వేలం.. ఎక్కడో తెలుసా..?

జిల్లాలో పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం, గోధుమలు, చక్కెరను సేకరించి అక్రమంగా వ్యాపారం చేసే వారి వద్ద నుంచి జప్తు చేసిన 947.496 MTల బియ్యం, 25.50 క్వింటాళ్ల గోధుమలు, 247కిలోల చక్కెర NOV18 న బహిరంగ వేలం వేస్తున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఎక్సైజ్ శాఖ ద్వారా అనుమతి పొందిన ప్రతినిధులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు కలెక్టరేట్ DCSO కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
News October 30, 2025
కేశంపేట: భారీ వర్షానికి పాడైన బొప్పాయి తోట

మొంథా తుఫాన్ ప్రభావంతో కేశంపేటలో వ్యవసాయం దెబ్బతింది. తొమ్మిదిరేకులకి చెందిన పంది రామ్ రెడ్డి 4 ఎకరాలలో బొప్పాయి పంటను సాగు చేస్తున్నాడు. కాత పూత దశలో ఉన్న బొప్పాయి భారీ వర్షానికి నేలకొరిగింది. రూ.లక్షల పెట్టుబడి పెడితే అంతా నాశనం అయ్యింది సదరు రైతు వాపోయాడు.


