News February 11, 2025
ఆగిరిపల్లి: ప్రమాదంలో నలుగురికి గాయాలు

ఆగిరిపల్లి మండలం వట్టిగుడుపాడు గ్రామంలో సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. మధుమోహనరావు, వెంకటేశ్వరరావు, మనోహరం, అభిలాష్ లు ప్రమాదంలో గాయపడినట్లు హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు తెలిపారు. నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు.
Similar News
News November 4, 2025
అనకాపల్లి: ‘అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’

ఏపీ ఎంఎస్ఎంఈడీసీ ఆధ్వర్యంలో ఈనెల 9, 10వ తేదీల్లో విశాఖలో ఎగుమతి సదస్సు జరుగుతుందని కలెక్టర్ విజయ కృష్ణన్ మంగళవారం తెలిపారు. ఈ సదస్సులో ఇంజినీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్, తదితర రంగాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారన్నారు. అవకాశాన్ని పారిశ్రామికవేత్తలు వినియోగించుకోవాలని కోరారు.
News November 4, 2025
KNR: టెక్నాలజీ హబ్కి శ్రీకారం చుట్టిన NRI

తను నిర్మించే నూతన గృహం యువతకు, ప్రజలకు ఉపయోగపడాలని వినూత్నంగా “రాజ గృహ” అనే పేరును నామకరణం చేసినట్లు NRI సరిగొమ్ముల హరిప్రసాద్ తెలిపారు. ఇల్లందకుంట మండలం బూజునూరులో తను నిర్మించే గృహంలో గౌతమ బుద్ధ, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఆయన శ్రీకారం చుట్టారు. తను అమెరికాలో ఉన్నప్పటికీ గ్రామాన్ని విద్యా, వైద్యం, వ్యవసాయ అభివృద్ధికై టెక్నాలజీ హబ్గా మారుస్తానని హరిప్రసాద్ పేర్కొన్నారు.
News November 4, 2025
అమరావతిలో 158 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్

రాష్ట్రంలో సాంకేతిక విప్లవానికి నాంది పలకడానికి అమరావతి క్వాంటమ్ వ్యాలీ సిద్ధమవుతోంది. ఇక్కడ 158 క్యూబిట్ల సామర్థ్యం గల అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయనున్నారు. దీనిని తాత్కాలికంగా VIT క్యాంపస్లో ఏర్పాటు చేశారు. జనవరి 2026 నాటికి అధికారికంగా అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్ట్ అమరావతిని భవిష్యత్ సాంకేతిక కేంద్రంగా మార్చడంలో కీలకపాత్ర పోషిస్తుందని కూటమి నేతలు చెబుతున్నారు.


