News February 3, 2025

ఆజామ్ జాహి మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ

image

వరంగల్ ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. 2002లో 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి మిల్లును మూసివేశారని తెలిపారు.

Similar News

News February 3, 2025

విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రణాళిక: కలెక్టర్

image

పీఎంశ్రీ పథకం ద్వారా ఎంపికైన ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.సత్య శారద ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ వీసీ సమావేశ మందిరంలో పీఎం శ్రీ పథకం కింద జిల్లాలో ఎంపికైన 16 ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లతో మంజూరైన నిధులు, చేసిన వివిధ అభివృద్ధి పనులు తదితర అంశాలపై చర్చించారు.

News February 3, 2025

వరంగల్ విద్యార్థికి ప్రపంచ రికార్డులో చోటు

image

వరంగల్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి అభ్యసిస్తున్న ఇమ్మడి అభిరామ్‌కు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. స్కూల్లో సీనియర్ విద్యార్థులకు నిర్వహించిన సాంస్కృతిక దినోత్సవంలో అభిరామ్ మహాభారతంలోని కర్ణుడి వేషాధరణలో 5 నిమిషాల 30 సెకన్ల పాటు అనర్గళంగా ఏకపాత్రాభినయం ప్రదర్శించాడు. ఈ ఏకపాత్రాభినయాన్ని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ నమోదు చేసుకొని సూపర్ టాలెంట్ కిడ్ అవార్డుకు ఎంపిక చేశారు.

News February 3, 2025

ఏటూరునాగారంలో ‘పుష్ప’ నటుడు సందడి

image

ఏటూరునాగారంలో సోమవారం పాన్ ఇండియా పుష్ప సినిమా నటుడు కేశవ (బండారి జగదీశ్ ప్రతాప్) సందడి చేశాడు. తాళ్లగడ్డలోని ఓ బిర్యానీ హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కేశవను చూసేందుకు స్థానిక ప్రజలు, అభిమానులు తరలివచ్చారు. కేశవతో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. నటుడు కేశవ సైతం ‘తగ్గేదేలే’ అంటూ స్థానిక ప్రజలను అలరించాడు.