News February 3, 2025

ఆజామ్ జాహి మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ

image

వరంగల్ ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. 2002లో 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి మిల్లును మూసివేశారని తెలిపారు.

Similar News

News November 17, 2025

కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలవవు: ఈటల

image

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్‌తో గెలవలేమని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పడం గమనార్హం. ఇతర పార్టీల్లోని హిందువులంతా బీజేపీలోకి రావాలన్న బండి సంజయ్ వ్యాఖ్యల వేళ ఈటల కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇద్దరు నేతలూ తలో మాట మాట్లాడటంపై బీజేపీ క్యాడర్‌లో అయోమయం నెలకొంది.

News November 17, 2025

కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలవవు: ఈటల

image

తెలంగాణలో డివిజన్ పాలిటిక్స్‌తో గెలవలేమని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడలేవన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పడం గమనార్హం. ఇతర పార్టీల్లోని హిందువులంతా బీజేపీలోకి రావాలన్న బండి సంజయ్ వ్యాఖ్యల వేళ ఈటల కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇద్దరు నేతలూ తలో మాట మాట్లాడటంపై బీజేపీ క్యాడర్‌లో అయోమయం నెలకొంది.

News November 17, 2025

సౌదీలో రాంనగర్‌ వాసుల మృతి.. పేర్లు ఇవే!

image

సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో రాంనగర్ వాసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల వివరాలను వారి బంధువులు Way2Newsకు వెల్లడించారు. 1.నసీరుద్దీన్, 2.ఉమైజా, 3.మరియం ఫాతిమా, 4.SK జైనుద్దీన్, 5.మెహరిష్, 6.మహమ్మద్, 7.రీదా తజీన్, 8.ఉజైరుద్దీన్, 9.అక్తర్ బేగం, 10.అనీస్ ఫాతిమ, 11.అమీనా బేగం, 12.సారా బేగం, 13.షబానా బేగం, 14.హుజైఫా జాఫర్, 15.రిజ్వానా బేగం, 16.సలాఉద్దీన్, 17.ఫరానా సుల్తానా, 18.తాసిమా తహరీన్.