News February 3, 2025
ఆజామ్ జాహి మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ

వరంగల్ ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. 2002లో 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి మిల్లును మూసివేశారని తెలిపారు.
Similar News
News January 20, 2026
నెల్లూరు: పొలంబడి.. తడబడి..!

రైతులకు సాగు పాఠాలు నేర్పే పొలం’బడి’ కార్యక్రమం తడబడుతోంది. 25 ఎకరాల విస్తీర్ణంలో 30 మంది రైతులతో ప్రతీ మంగళ, బుధవారాలు వరుసగా 14 వారాలపాటు కార్యక్రమాలు జరగాల్సి ఉన్నా ఆచరణలో నీరుగారుతోంది. 24-25 ఏడాదికి జిల్లా వ్యాప్తంగా 31 పొలం బడి శిక్షణ తరగతులు చేపట్టాల్సి ఉన్నా పలుచోట్లా మొదలెట్టలేదు. వీటి నిర్వహణకు ₹10.85 లక్షలు కేటాయించారు. అధికారులు స్పందన లేకపోవడంతో ఆ నిధులు సైతం పక్కదారి పడుతున్నాయట.
News January 20, 2026
మాచారెడ్డి: విద్యార్థి అభిమన్యు ప్రాజెక్టుకు ఎస్పీ ఫిదా!

మాచారెడ్డి (M) మర్రితండా వాసి అభిమన్యు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల జరుగుతున్న ప్రాణ, ఆస్తి నష్టాలను గమనించి చలించిపోయాడు. యుద్ధం వల్ల కలిగే అనర్థాలను, ప్రపంచానికి శాంతి ఎంత అవసరమో వివరిస్తూ ప్రాజెక్టును సిద్ధం చేశాడు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో SP రాజేష్ చంద్రను కలిసి తన ప్రాజెక్టును వివరించాడు. చిన్న వయసులోనే ప్రపంచ శాంతి పట్ల అభిమన్యు చూపిస్తున్న తపనను ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు.
News January 20, 2026
23న రాజధాని రైతులకు ఇ-లాటరీ: నారాయణ

AP: రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు మంత్రి నారాయణ గుడ్న్యూస్ చెప్పారు. ‘అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను ఈనెల 23న కేటాయిస్తాం. ఇ-లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు జరుగుతుంది. రైతులు వాటిని అప్పటికప్పుడే రిజిస్టర్ చేయించుకోవచ్చు. పెండింగ్లో ఉన్న రైతులందరికీ అదే రోజు లాటరీ నిర్వహిస్తాం. రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది’ అని తెలిపారు.


