News February 18, 2025

ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్పీ

image

ఆటో డ్రైవర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సోమవారం ఎస్పీ బిందు మాధవ్ సూచించారు. కాకినాడ ట్రాఫిక్ 1, 2 టౌన్ పోలీసులు నగరంలో ఓవర్ లోడ్ ప్యాసింజర్, స్కూల్ చిల్డ్రన్స్ ఆటోలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని ఆటోలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో 98 ఆటోలు సీజ్ చేసి కేసు నమోదు చేసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Similar News

News November 7, 2025

హెయిర్ డై వేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

image

ఒక్క తెల్లవెంట్రుక కనబడగానే కంగారు పడిపోయి జుట్టుకు రంగులువేస్తుంటారు చాలామంది. అయితే హెయిర్ డై వేసేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇన్‌స్టాంట్ కలర్ ఇచ్చే బ్లాక్ హెన్నా, షాంపూల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. సల్ఫేట్లు, అమోనియా పెరాక్సైడ్, PPD లేనివి ఎంచుకోవాలి. తలస్నానం చేసి కండిషనర్ రాశాకే రంగు వేయాలి. ముఖానికి, మాడుకు మాయిశ్చరైజర్ రాసి, తర్వాత డై వేసుకోవాలని సూచిస్తున్నారు.

News November 7, 2025

జూబ్లిహిల్స్ బైపోల్స్: సమయం లేదు మిత్రమా.. !

image

ప్రచారానికి గడవు ఈరోజుతోపాటు ఉన్నది మూడు రోజులే.. అంతే.. అదీ ఆదివారం సాయంత్రానికి క్లోజ్.. అందుకే నాయకులు నిద్రపోవడం లేదు. రాత్రి వరకు ప్రచారం చేసి రాత్రి వేళ స్థానిక నాయకులతో మంతనాలు.. ఏ ఓటు ఎవరికి వచ్చే అవకాశం.. మనకెన్ని ఓట్లు వస్తాయనే విషయంపైనే సమాలోచనలు.. ఓటు మనకు రాకపోతే ఎలా రాబట్టుకోవాలనేది కూడా ఆలోచిస్తున్నారు. ఈ మూడు రోజులను పక్కాగా ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

News November 7, 2025

NZB: బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన కవిత

image

చేవెళ్ల బస్సు ప్రమాదంలో గాయపడి చేవెళ్లలోని పీఎంఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు.