News February 18, 2025
ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్పీ

ఆటో డ్రైవర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సోమవారం ఎస్పీ బిందు మాధవ్ సూచించారు. కాకినాడ ట్రాఫిక్ 1, 2 టౌన్ పోలీసులు నగరంలో ఓవర్ లోడ్ ప్యాసింజర్, స్కూల్ చిల్డ్రన్స్ ఆటోలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని ఆటోలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్లో 98 ఆటోలు సీజ్ చేసి కేసు నమోదు చేసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Similar News
News December 1, 2025
భార్యను చంపి సెల్ఫీ.. వాట్సాప్లో స్టేటస్

భార్యను చంపి డెడ్ బాడీతో సెల్ఫీ తీసుకున్నాడో భర్త. కోయంబత్తూరు(TN)లో నివసించే బాలమురుగన్, శ్రీప్రియ(30)కు ముగ్గురు సంతానం. అయితే శ్రీప్రియ కొన్నాళ్లుగా హాస్టల్లో ఉంటూ జాబ్ చేస్తోంది. భార్య ఇంకొకరితో రిలేషన్లో ఉందని బాలమురుగన్ అనుమానం పెంచుకున్నాడు. హాస్టల్కు వెళ్లి కొడవలితో దాడి చేసి చంపాడు. బాడీతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ‘ద్రోహానికి ఫలితం మరణం’ అని రాసుకొచ్చాడు.
News December 1, 2025
విశాఖ సమస్యలపై పార్లమెంట్లో గళం విప్పుతారా?

నేటి నుంచి పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఉమ్మడి విశాఖ నుంచి ముగ్గురు MPలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జిల్లాలో ప్రధాన సమస్యలైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అపోహలు తొగించేలా ప్రకటన, రైల్వే జోన్కు గెజిట్ నోటిఫికేషన్, రాజమహేంద్రవరం-అనకాపల్లి నేషనల్ హైవేకి నిధులు, అనకాపల్లిలోని పలు స్టేషన్లలో రైళ్లకు హాల్ట్, గిరిజనుల హక్కుల పరిరక్షణపై గళం విప్పాలని ప్రజలు కోరుతున్నారు.
News December 1, 2025
ఖమ్మం: ఒకే ఊరు.. రెండు పంచాయతీలు

కూసుమంచి మండలం ఈశ్వరమాధారం పెద్ద గ్రామ పంచాయతీని గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం మూడు కొత్త పంచాయతీలుగా (ఈశ్వరమాధారం, మంగలితండా, రాజుపేట బజారు) విడదీసింది. అయితే, ఈ విభజనలో ఊరి మధ్యలో ఉన్న సీసీ రోడ్డునే సరిహద్దుగా నిర్ణయించారు. దీని కారణంగా ఇళ్లు పక్కపక్కనే ఉన్నా, నివాసితులు రెండు వేర్వేరు గ్రామ పంచాయతీల పరిధిలోకి వస్తున్నారు. ఈ అస్తవ్యస్త విభజన వల్ల ప్రజలకు పరిపాలనా సమస్యలు తలెత్తుతున్నాయి.


