News March 4, 2025
ఆటో డ్రైవర్ కూతురికి ఎస్ఐ ఉద్యోగం

బేతంచెర్లకు చెందిన శేషాద్రి, నాగలక్ష్మి దంపతుల కుమార్తె నిర్మల ఎస్ఐగా ఎంపికయ్యారు. శేషాద్రికి ఐదుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్న శేషాద్రి.. తన మూడో కుమార్తె నిర్మలను బీటెక్ వరకు చదివించారు. ఎస్ఐగా ఎంపికై అనంతపురం పోలీస్ శిక్షణ కార్యాలయంలో శిక్షణ పూర్తి చేసుకుని శ్రీ సత్యసాయి జిల్లాలో పోస్టింగ్ పొందారు. ఈ సందర్భంగా పలువురు నిర్మలను అభినందించారు.
Similar News
News October 18, 2025
ఆడపిల్లలకు చదువుకునే హక్కు ప్రతి ఒక్కరూ ఇవ్వాలి: కలెక్టర్

ఆడపిల్లలందరికీ చదువుకునే హక్కు తప్పకుండా ఇవ్వాలని, వారికి పౌష్టికాహారం అందించి, సమాజంలో లింగ వివక్ష లేకుండా చూడాలని ఇవాళ కలెక్టర్ సిరి అంతర్జాతీయ బాలికా దినోత్సవంలో అన్నారు. జిల్లాలో కేవలం 56 శాతం ఉన్న అక్షరాస్యత రేటును 100 శాతంకి పెంచాలని కోరారు. విద్యార్థులు బాగా చదువుకుని జీవితంలో రాణించాలని, విద్యకు ప్రభుత్వం ఉచిత సౌకర్యాలు అందిస్తోందని, బాలికల రక్షణకు ‘స్త్రీ శక్తి’ యాప్ ఉందని పేర్కొన్నారు.
News October 18, 2025
జిల్లాలో ప్రధాని పర్యటన విజయవంతం: కలెక్టర్

జిల్లాలో ప్రధానమంత్రి పర్యటన విజయవంతంగా నిర్వహించినందుకు అధికారులు, సిబ్బందిని కలెక్టర్ డా. సిరి అభినందించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందరూ సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు. పర్యటనలో సీపీవో, ఆర్ అండ్ బీ, ఆర్టీసీ, డీఆర్వో, పారిశుద్ధ్య, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు తదితర అధికారులు సమర్థవంతగా వ్యవహరించారని తెలిపారు. పర్యటనలో ఒక అబ్బాయి మరణించడం దురదృష్టకరమని అన్నారు.
News October 18, 2025
ప్రధాని పర్యటనతో సీమకు ఒరిగిందేంటి?: ఎస్వీ మోహన్ రెడ్డి

ప్రధాని మోదీ కర్నూలు, శ్రీశైలం పర్యటనకు రూ.300 కోట్లు ఖర్చు చేసిన సీఎం చంద్రబాబు, రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కూడా మంజూరు చేయించుకోలేదని జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. శనివారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనతో సీమకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు కర్నూలుకు మంజూరైన హైకోర్టు, లా యూనివర్సిటీని అమరావతికి తరలించడం దుర్మార్గమని మండిపడ్డారు.