News January 22, 2025
ఆడయినా, మగయినా సమానంగా చూడాలి: డీఎంహెచ్వో

పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య అధికారిణి డాక్టర్ జి అన్నా ప్రసన్నకుమారి ఆధ్వర్యంలో జిల్లా సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భస్థపూర్వ, గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధిత చట్టమునుసరించి స్కానింగ్ కేంద్రాలలో శిశువులను నిర్దారించకూడదన్నారు. ఆడయినా, మగయిన సమానంగా చూడాలన్నారు.
Similar News
News February 18, 2025
HYD: మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలి: సీఎం

గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీలో జరుగుతున్న షీల్డ్ 2025 సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మార్పులకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వం మారాలని, ఒకప్పుడు ఇంట్లో చొరబడి మాత్రమే దోపిడీలు చేసేవారని, ఇప్పుడు దొంగలు ఎక్కడో ఉండి మన సొమ్ము దోచేస్తున్నారన్నారు. పోలీసు వ్యవస్థ దేశం మొత్తం ఒక యూనిట్గా పని చేస్తేనే సైబర్ నేరాలను అరికట్టగలమన్నారు.
News February 18, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి మరో స్టార్ బౌలర్ దూరం

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ జట్టుకు కీలక బౌలర్ దూరమయ్యారు. కుడి పాదానికి గాయం కారణంగా లోకి ఫెర్గూసన్ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. అతడి స్థానంలో జెమిసన్ను తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్కు స్టార్ బౌలర్లు దూరమైన సంగతి తెలిసిందే. కీలక బౌలర్లు దూరమవడంతో బ్యాటర్లకు ఈ టోర్నీ పండగే కానుందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
News February 18, 2025
తారకరత్న వర్ధంతి వేళ భార్య ఎమోషనల్ పోస్ట్

నందమూరి తారకరత్న వర్ధంతి వేళ ఆయన సతీమణి అలేఖ్య భావోద్వేగానికి గురయ్యారు. ‘విధి వక్రించి మిమ్మల్ని మా నుంచి దూరం చేసింది, నువ్వులేని లోటు లోకంలో ఏది పూరించలేదు. మీ జ్ఞాపకాలు మా చుట్టూనే తిరుగుతున్నాయి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తారకరత్న ఫొటో ముందు పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. రెండేళ్ల క్రితం యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో మరణించారు.