News April 8, 2025
ఆత్మకూరు ప్రైవేట్ ఆసుపత్రిలో విచారణ చేపట్టిన డీఎంహెచ్ఓ

ఆత్మకూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవానికి వచ్చిన ఓ మహిళకు డెలివరీ చేసి పసికందును కోసి బయటకు తీశారనే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన బాధితులతో జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ఆపరేషన్ చేసిన డాక్టర్లను ఆయన విచారించారు. ఈ ఘటనలో డాక్టర్ల పై చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి అన్నారు.
Similar News
News April 20, 2025
నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఖమ్మం

ఖమ్మం జిల్లా నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఉదయం 9 గంటల నుంచి భానుడు ఉగ్రరూపం దాల్చుతుండడంతో ప్రజలు సాయంత్రం వరకు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అలాగే జిల్లాలోని పలుచోట్ల 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే వారం రోజులు సాధారణం కంటే రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
News April 20, 2025
IPL PLAYOFFS: ఏ జట్టు ఎన్ని గెలవాలంటే?

IPL 2025లో అన్ని జట్లు కనీసం 7 మ్యాచులు ఆడాయి. దాదాపు అన్ని జట్లూ ప్లే ఆఫ్స్ పోటీలోనే ఉన్నాయి. GT 7 మ్యాచుల్లో 3, DC 7 మ్యాచుల్లో 3, PBKS 7 మ్యాచుల్లో 3, LSG 6 మ్యాచుల్లో 3, RCB 7 మ్యాచుల్లో 4, KKR 7 మ్యాచుల్లో 5, MI 7 మ్యాచుల్లో 5, SRH 7 మ్యాచుల్లో 6, CSK 7 మ్యాచుల్లో 6, RR 6 మ్యాచులకు ఆరు గెలిస్తేనే ప్లేఆఫ్స్ చేరే ఛాన్స్ ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
News April 20, 2025
పెద్దపల్లి: రైలు ఢీకొని వ్యక్తి మృతి

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శనివారం రాత్రి జరిగింది. నిన్న రాత్రి సుమారుగా 11, 12 గంటల సమీపంలో గుర్తుతెలియని రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పొత్కపల్లి గ్రామానికి చెందిన సుధగోని తిరుపతిగా గుర్తించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.