News February 28, 2025

ఆత్మకూరు: బ్రహ్మోత్సవాలకు బోట్‌ల రాక

image

ఆత్మకూరు పట్టణంలో త్వరలో జరగబోయే చర్ల పరమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరమేశ్వర స్వామి చెరువులో విహరించేందుకు పిల్లలకు, పెద్దలకు ఆనందం కలిగించేందుకు, బ్రహ్మోత్సవాల కమిటీ సభ్యులు బోట్ లను తెప్పించారు. ఇట్టి బోట్ లు పరమేశ్వర స్వామి చెరువులో విహరించనున్నాయి. వీటి రాకకు కృషి చేసిన ఎమ్మెల్యే శ్రీహరి కి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News November 27, 2025

పంచాయతీ ఎన్నికలు.. పాలమూరులో ఉత్కంఠ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని వెల్దండ, తిమ్మనోనిపల్లిలో బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లను కోర్టు నేడు విచారించనుంది.

News November 27, 2025

అమరావతిలో రూ.1,328 కోట్ల పెట్టుబడులు.. 6,541 ఉద్యోగాలు

image

ఈ నెల 28న అమరావతిలోని సీఆర్డిఏ కార్యాలయం వద్ద 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయ పనులకు శంకుస్థాపన జరగనుంది. 15 బ్యాంకుల ద్వారా రూ.1,328 కోట్ల పెట్టుబడులు, 6,541 ఉద్యోగాల కల్పన అమరావతిలో జరగనుందని CRDA కమిషనర్ కె. కన్నబాబు IAS బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నాబార్డ్, ఆప్కాబ్, ఎల్ఐసీ, NIACLతో పాటు 11 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉద్ధండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెంలో ఏర్పాటు కానున్నాయన్నారు.

News November 27, 2025

మంచిర్యాల: 90 సర్పంచ్, 816 వార్డు స్థానాలకు నామినేషన్

image

మంచిర్యాల జిల్లాలోని తొలి విడతలో 4 మండలాల్లో 90 సర్పంచ్, 816వార్డుల స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. దండేపల్లి (M)లో 31 GPలు, 278 వార్డులు, హాజీపూర్ (M)లో 12 GPలు,106 వార్డులు, జన్నారం (M)లో 29 GPలు, 272 వార్డులు, లక్షెట్టిపేట (M)లో 18 GPలు,160 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు.