News March 23, 2025
ఆత్మకూరు: ‘రాజీవ్ యువ వికాసం’ గడువు పొడగింపు

రాష్ట్ర ప్రభుత్వం యువకులకు స్వయం ఉపాధి నిమిత్తం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం గడువును పొడిగించినట్లు వనపర్తి జిల్లా వెనుకబడిన సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి ఉమాదేవి తెలిపారు. ఈ పథకానికి ఈనెల 17 నుండి ఏప్రిల్ 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. యువత ఇది అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9010185381 సంప్రదించాలని కోరారు.
Similar News
News March 31, 2025
KMR: BC, SC, ST JAC ఏర్పాటు

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణలో సామాజిక న్యాయం కోసం BC, SC, ST రాజ్యాధికార JAC నూతన వేదిక ఏర్పాటు’ కార్యక్రమంలో DSP కామారెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర అగ్రవర్ణాల కన్నా తెలంగాణలో ఉన్న అగ్రవర్ణాల చేతిలోనే బహుజన సమాజం ఎక్కువగా మోసపోయిందన్నారు. అందుకే అగ్రకులాల కబంధహస్తాల నుంచి అణగారిన వర్గాల ప్రజలను విడిపించి స్వతంత్రులను చేయడానికే JAC ఏర్పటు చేస్తున్నట్లు తెలిపారు.
News March 31, 2025
వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ కార్యదర్శిగా ఈవీ శ్రీనివాస్

వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్(WTITC) గౌరవ కార్యదర్శి, సలహాదారుడిగా హనుమకొండకు చెందిన సామాజికవేత్త ఈ.వి.శ్రీనివాస్ రావును సంస్థ స్థాపకుడు సందీప్ మక్తాలా నియమించారు. ఈ సందర్భంగా ఈ.వీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో తెలుగు ప్రజల ఐటీ రంగ పురోగతికి అంకితభావంతో కృషి చేస్తానని పేర్కొన్నారు.
News March 31, 2025
CBG ప్లాంట్లు.. ఎకరానికి రూ.31వేల కౌలు: గొట్టిపాటి

APలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్ ముందుకొచ్చిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎల్లుండి కనిగిరిలో CBG తొలి యూనిట్కు అనంత్ అంబానీ, లోకేశ్ శంకుస్థాన చేస్తారన్నారు. త్వరలో మార్కాపురం, గిద్దలూరు, దర్శిలోనూ ప్రారంభిస్తామని చెప్పారు. ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వ భూమికి ఎకరానికి రూ.15వేలు, ప్రైవేట్ భూమికి రూ.31వేల కౌలు అందిస్తామని పేర్కొన్నారు.