News February 25, 2025

ఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి

image

రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ములు మృతి చెందిన విషాద ఘటన ఆత్మకూరు మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. రహీంఖాన్‌పేట్‌కు చెందిన గూడూరు చంద్రశేకర్, మత్సగిరి సోమవారం రాత్రి బంధువుల ఇంటి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా కీసర వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో అన్నదమ్ములు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో గ్రామంలో, వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Similar News

News December 5, 2025

బెంజ్, రేంజ్ రోవర్ కాకుండా ఫార్చునర్.. అందుకేనా?

image

నిన్న మోదీ, పుతిన్ టయోటా ఫార్చునర్ కారులో ప్రయాణించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. రేంజ్ రోవర్, బెంజ్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ వారు ఫార్చునర్‌లోనే ప్రయాణించారు. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా 2022లో అమెరికాతో పాటు యూరప్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశాల కార్లు కాకుండా జపాన్‌కు చెందిన టయోటాను ఎంచుకుని మోదీ, పుతిన్ వారికి బలమైన సందేశం పంపినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

News December 5, 2025

పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్‌, ఎస్పీ

image

రెంటచింతల మండలం మంచికల్లు గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత పోలేరమ్మ అమ్మవారిని కలెక్టర్‌ కృతికా శుక్ల, ఎస్పీ కృష్ణారావు దర్శించుకున్నారు. తిరునాళ్ల సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్నాటి కోనసీమగా పిలువబడే మంచికల్లులో ఎన్నో సంవత్సరాలుగా ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో గురజాల, మాచర్ల ఎమ్మెల్యేలు, డీఎస్పీ, తదితరులు పాల్గొన్నారు.

News December 5, 2025

1967 నుంచి పాతలింగాలలో ఏకగ్రీవ పరంపర

image

ఖమ్మం: దివంగత నేత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామమైన కామేపల్లి మండలం పాతలింగాలలో 50 ఏళ్లుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగలేదు. 1967లో వెంకటరెడ్డి సర్పంచ్‌గా గెలిచిన నాటి నుంచి నేటి వరకు ఈ గ్రామం ఏకగ్రీవ పరంపరను కొనసాగిస్తోంది. ప్రస్తుతం రాంరెడ్డి గోపాల్‌రెడ్డి నేతృత్వంలో గ్రామ పెద్దల సహకారంతో సమస్యలు పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.