News August 16, 2024

ఆత్మకూర్: యాక్సిడెంట్‌.. 2 నెలల పసికందు మృతి

image

ORRపై <<138659>>యాక్సిడెంట్‌<<>>లో చనిపోయిన ముగ్గురిలో 2 నెలల బాలుడు ఉన్నారు. ఆత్మకూర్‌కు చెందిన 12 మంది తూఫాన్‌ వాహనంలో యాదాద్రికి నుంచి వస్తున్నారు. కరీంనగర్‌ నుంచి శంషాబాద్‌ వెళ్తున్న కారు వేగంగా వచ్చి వెనుక నుంచి తూఫాన్‌ను బలంగా ఢీకొట్టడంతో ఎగిరిపడింది. తూఫాన్‌లో ఉన్న డ్రైవర్ తాజ్‌, వరాలు స్పాట్‌లో చనిపోయారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ 2 నెలల బాలుడు మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదైంది.

Similar News

News December 15, 2025

మహబూబ్ నగర్ జిల్లా నేటి ముఖ్యంశాలు

image

@మహబూబ్ నగర్ జిల్లాల్లో రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
@మిడ్జిల్ మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ. డి.జానకి ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించారు.
@కౌకుంట్ల మండలంలో 12 గ్రామపంచాయతీలకు గాను.. 10 గ్రామపంచాయతీలో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు.
@దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి స్వగ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి పావని 110 ఓట్లతో గెలుపొందింది.
@ మిడ్జిల్‌లో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు.

News December 14, 2025

సీసీ కుంట నూతన సర్పంచులు వీరే !

image

అల్లిపూర్ శారదమ్మ
అమ్మాపూర్ – రంజిత్ కుమార్
బండార్ పల్లి – బత్తుల సుజాత
వడ్డేమాన్ – స్వప్న
సీసీ కుంట మానస – దమాగ్నాపూర్ పావని
ఏదులాపూర్ – ఆంజనేయులు
ఫర్దిపూర్ – శివకుమార్
గోప్య నాయక్ తండా – రాములు
గూడూరు – భీమన్న
లాల్ కోట – గోపాల్
మద్దూరు – దామోదర్
నెల్లికొండి – సుకన్య
పల్లమర్రి – లక్ష్మీ
సీతారాంపేట – హుస్సేన్ జీ
ఉంద్యాల -ఆంజనేయులు.

News December 14, 2025

MBNR జిల్లాలో తొలి సర్పంచ్ గెలుపు ఇక్కడే..!

image

మిడ్జిల్ మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మసి గుండ్లపల్లి సర్పంచ్‌గా శ్రీశైలం యాదవ్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి మీద చెన్నయ్య 16ఓట్ల తేడాతో గెలుపొందారు. 8 వార్డు స్థానాలకు సభ్యులను గ్రామస్థులు ఎన్నుకున్నారు. సందర్భంగా గ్రామ ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు.