News February 19, 2025
ఆత్రేయపురం: గాయపడిన మహిళ మృతి

ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామానికి చెందిన చిట్టూరి లక్ష్మీకాంతం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై రాము తెలిపారు. ఈ నెల 14న ఇంట్లో పెట్రోలు కింద పడి మంటలు చెలరేగటంతో లక్ష్మీ, పెద్ద కొడుకు సాయికృష్ణ గాయపడ్డారు. కాగా తీవ్రంగా గాయపడిన లక్ష్మీకాంతం చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు.
Similar News
News November 5, 2025
కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్.. 43 మందికి శిక్షలు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి 43 మందికి కోర్టు శిక్షలు విధించింది. మద్యం తాగి వాహనం నడిపిన ఆరుగురు వ్యక్తులకు న్యాయస్థానం 1 రోజు జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. వీరిలో కామారెడ్డిలో ఇద్దరు, మాచారెడ్డి, దోమకొండ, తాడ్వాయి ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. మిగిలిన 37 మంది వాహనదారులకు రూ.37 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
News November 5, 2025
నిజామాబాద్: ఇద్దరికి జైలు శిక్ష

నవీపేట్ మండలం లింగాపూర్ గ్రామంలో 2020 సంవత్సరంలో పొలం వివాదంలో గొడవ కారణంగా కేశపురం మహేశ్ పై గడ్డపారతో దాడి చేయగా గగ్గోని నవీన్, గగ్గోని హనుమాన్లుపై కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా ఈరోజు నిజామాబాద్ స్టేషన్ కోడ్ జడ్జి సాయిసుధా ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చి గగ్గోని నవీన్కు ఐదేళ్లు, హనుమాన్లుకు మూడేళ్ల జైలు శిక్ష విధించారని నవీపేట్ ఎస్ఐ తిరుపతి తెలిపారు.
News November 5, 2025
న్యూస్ రౌండప్

* US మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ కన్నుమూత
* రాష్ట్ర పరిధిలో తిరిగే ప్రైవేట్ టూరిస్ట్ బస్సులకు గ్రీన్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించి, చర్చలకు పిలవాలని AP ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం డిమాండ్
* దుబాయ్లో మంత్రి నారాయణ పర్యటన.. రాష్ట్రంలో పెట్టుబడులకు అపరెల్ గ్రూపుకు ఆహ్వానం
* జూబ్లీహిల్స్ బైపోల్: హోమ్ ఓటింగ్ వినియోగించుకున్న 97 మంది సీనియర్ సిటిజన్లు, వికలాంగులు


