News February 20, 2025

ఆత్రేయపురం: చికిత్స పొందుతూ తల్లీ కొడుకు మృతి

image

ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో ప్రమాదవశాత్తు పెట్రోల్‌తో నిప్పంటుకుని లక్ష్మీకాంతం చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అదే ప్రమాదంలో తల్లిని కాపాడబోయి గాయపడిన సాయికృష్ణ బుధవారం రాత్రి మృతి చెందాడు . దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై రాము తెలిపారు.

Similar News

News November 24, 2025

ఐబొమ్మ రవి సంపాదన రూ.100 కోట్లు?

image

మూవీల పైరసీ, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌తో ఐబొమ్మ <<18377140>>రవి<<>> రూ.100 కోట్లకు పైగా సంపాదించాడని పోలీసులు విచారణలో గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌ను సేకరించినట్లు సమాచారం. మూవీపై క్లిక్ చేయగానే 15 యాడ్స్‌కు లింక్ అయ్యేలా వెబ్‌సైట్‌లో ఏర్పాటు చేశాడని గుర్తించారు. మరోవైపు ఈ విచారణపై రేపు ప్రెస్‌మీట్‌లో సజ్జనార్ వివరాలను వెల్లడిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

News November 24, 2025

జాతీయ స్థాయి విలువిద్య పోటీలకు పాడేరు విద్యార్థి ఎంపిక

image

పాడేరు శ్రీ మోదమాంబ విద్యాలయంలో పదో తరగతి విద్యార్థి సీహెచ్ మోహిత్ సాయి రాష్ట్ర సబ్‌జూనియర్ విలువిద్య పోటీల్లో రెండో స్థానం సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. అరుణాచల్ ప్రదేశ్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్న విద్యార్థికి కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సోమవారం ఆర్థిక సహాయం అందించి అభినందనలు తెలిపారు. క్రీడా అధికారి జగన్మోహన్ రావు, కోచ్ సుధాకర్ నాయుడు ఉన్నారు.

News November 24, 2025

వరంగల్: నిత్య పెళ్లికూతురి స్టోరీ.. వెలుగులోకి తెచ్చిన Way2News

image

తనకు వివాహమై కూతురు ఉన్నప్పటికీ పలు మ్యాట్రిమోనీ సైట్లలో ప్రొఫైల్ ఫొటోలు పెట్టి అమాయకులను పెళ్లిళ్లు చేసుకుని, అందిన కాడికి నగలు, నగదుతో పరారవుతున్న కిలాడీ లేడీ గురించి <<18378294>>Way2News<<>> వెలుగులోకి తెచ్చింది. పోలీసులు, నిఘావర్గాలు ఘటనపై ఆరా తీశాయి. పలు పత్రికలు, టీవీ ఛానళ్లు సైతం ఘటన గురించి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. Way2News కథనాన్ని పలువురు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.