News February 20, 2025

ఆత్రేయపురం: చికిత్స పొందుతూ తల్లీ కొడుకు మృతి

image

ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో ప్రమాదవశాత్తు పెట్రోల్‌తో నిప్పంటుకుని లక్ష్మీకాంతం చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అదే ప్రమాదంలో తల్లిని కాపాడబోయి గాయపడిన సాయికృష్ణ బుధవారం రాత్రి మృతి చెందాడు . దీనిపై కేసు నమోదు చేశామని ఎస్సై రాము తెలిపారు.

Similar News

News March 15, 2025

బీటెక్ విద్యార్థి అదృశ్యం

image

నల్లమాడ (మం) ఎద్దులవాండ్ల పల్లికి చెందిన రామ్మోహన్ రెడ్డి కుమారుడు బీటెక్ విద్యార్థి లక్ష్మీకాంత్ రెడ్డి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తన కుమారుడు అనంతపురం పీవీకేకే కళాశాలలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడని తెలిపారు. ఈనెల 7న బైక్‌పై బెంగళూరుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లి, అప్పటి నుంచి కనిపించకుండా పోయాడని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.

News March 15, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జిల్లా వ్యాప్తంగా సిపిఎం నేతల ధర్నా > రైలు కిందపడి యువకుడు మృతి > ప్రభుత్వంపై పోరాటం చేస్తాం జనగామ ఎమ్మెల్యే > రేపటి సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం > ప్రశాంతంగా ఎనిమిదవ రోజు ఇంటర్ పరీక్షలు > కొమురవెల్లికి బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు > 5వ రోజుకు చేరుకున్న ఎమ్మార్పీఎస్ నేతల నిరాహార దీక్ష > హామీలను నెరవేర్చిన తర్వాతే సీఎం జిల్లాలో అడుగు పెట్టాలి: రమేష్

News March 15, 2025

జమ్మికుంట: రైలుకింద పడి వ్యక్తి మృతి

image

జమ్మికుంట రైల్వేస్టేషన్లో వ్యక్తి మృతిచెందాడు. రైలు ఎక్కుతుండగా కొమురయ్య (50) జారిపడి చనిపోయాడు. మృతుడు రైల్వేలో గ్యాంగ్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడు స్వస్థలం హనుమకొండ జిల్లా సోమిడి.

error: Content is protected !!