News September 5, 2024

ఆదిమూలం బాధితులు చాలా మంది ఉన్నారు: వరలక్ష్మి

image

సత్యవేడు MLA కోనేటి ఆదిమూలం తనకు పదే పదే వీడియో కాల్స్ చేసేవారని బాధిత మహిళ వరలక్ష్మి ఆరోపించింది. ‘ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే నా నంబర్ తీసుకున్నాడు. తిరుపతిలోని ఓ హోటల్లో నాపై 3 సార్లు అత్యాచారం చేశాడు. నాలాగే సత్యవేడులో చాలా మంది ఆయన బాధితులు ఉన్నారు. వాళ్ల తరఫున నేను పోరాటం చేస్తా. అందుకే పెన్ కెమెరాలో రికార్డ్ చేశా. నన్ను చంపేస్తానని బెదిరించడంతోనే మీడియా ముందుకు వచ్చా ’ అని వరలక్ష్మి చెప్పారు.

Similar News

News July 9, 2025

చిత్తూరు: జగన్ పర్యటనపై DSP సూచనలు

image

బంగారుపాలెంలో రేపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనపైన DSP సాయినాథ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వన్ టౌన్, టూ టౌన్ సీఐలు మహేశ్వర్, నెట్టికంటయ్యలతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎస్పీ ఆదేశాల మేరకు జగన్ పర్యటనలో తప్పనిసరిగా పోలీసులు విధించిన ఆంక్షలు పాటించాలన్నారు. 500 మంది రైతులు మాత్రమే అనుమతి ఉందన్నారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పదు అన్నారు.150 మందికి నోటీసులు జారీచేశామన్నారు.

News July 8, 2025

చిత్తూరు: పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకాలు

image

చిత్తూరు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ఔత్సాహికులు ముందుకు వస్తే సహకారం అందజేస్తామని కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తే తగిన సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ వెల్లడించారు. నిరుద్యోగులకు శిక్షణ అందజేసి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.

News July 8, 2025

చిత్తూరు: వారి మధ్య నలుగుతున్నది పోలీసులే!

image

మామిడి రైతుల సమస్యల చుట్టూ జిల్లా రాజకీయం తిరుగుతుంది. పరిశ్రమలు వారు రూ. 8, ప్రభుత్వం రూ. 4, మొత్తం రూ.12 ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. రైతులకు న్యాయం చేయడం లేదని YCP బదులిస్తుంది. ఇటీవల YS జగన్ పర్యటనల్లో చోటు చేసుకున్న ఘటనలు నేపథ్యంలో సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో ఆయన పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. నిజానికి ఇరు పార్టీల రాజకీయం నడుమ పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చర్చించుకుంటున్నారు.