News April 24, 2024

ఆదిలాబాద్‌కు CM వరాల జల్లులు.. ఇవే

image

ఆదిలాబాద్ జిల్లావాసులకు సీఎం రేవంత్‌రెడ్డి వరాల జల్లు కురిపించారు. నాగోబా జాతరకు రూ.4 కోట్ల కేటాయించాలని నిర్ణయించామన్నారు. బోథ్ ప్రాంతంలో కుప్టీ ప్రాజెక్టు నిర్మిస్తామన్నారు. ముక్తి ప్రాజెక్టును కట్టి.. ఆదిలాబాద్‌కు నీళ్లిస్తామని హామీఇచ్చారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి అంబేడ్కర్ పేరు పెడుతామన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని, యూనివర్సిటీ ఏర్పాటు, CCI తెరిపిస్తామన్నారు.

Similar News

News January 16, 2025

సంక్షేమ పథకాలు అర్హులకే అందాలి: ADB కలెక్టర్

image

ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ఆదిలాబాద్ జడ్పీ మీటింగ్ హాల్‌లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లపై జిల్లా స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పీవో ఖుష్బూ గుప్తా హాజరయ్యారు.

News January 15, 2025

క్రీడలతో శారీరక ఆరోగ్యం: బోథ్ MLA

image

నేరడిగొండ మండలంలోని బొందిడిలో నిర్వహించిన ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలతో శారీరక ఆరోగ్యం కలుగుతుందన్నారు. అనంతరం యువకులతో కలిసి బ్యాటింగ్ చేసి సందడి చేశారు.

News January 15, 2025

జాతీయస్థాయి పరీక్షలో నార్మూర్ అమ్మాయి ప్రతిభ

image

నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన సోంకామ్లే సోని ప్రతిభను చాటింది. నేషనల్ మెటీరియాలజీ ఒలంపియాడ్ ఎర్త్ సైన్స్ అండ్ క్లైమేట్ ఛేంజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో జాతీయస్థాయిలో రెండవ ర్యాంకు సాధించింది. ఢిల్లీలో శాస్త్రవేత్తల చేతులమీదుగా అవార్డును అందుకుంది.