News January 28, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధరల వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,950గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.110తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

Similar News

News February 13, 2025

ADB: కరెంట్ షాక్‌తో బాలిక మృతి

image

కరెంట్ షాక్‌తో ADBకు చెందిన బాలిక మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. అంబేడ్కర్‌నగర్‌కు చెందిన 9వ తరగతి చదువుతున్న తహ్రీం గత నెల 18న తన ఇంటి డాబా పైకి వెళ్లింది. ఈ క్రమంలో డాబాపై నుంచి వెళుతున్న హైఓల్టేజీ విద్యుత్ తీగలతో కరెంట్ సరఫరా కావడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే కుటుంబీకులు రిమ్స్‌కు, అక్కడి నుంచి మహారాష్ట్రలోని వార్ధాకు  ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం బాలిక మృతి చెందింది.

News February 13, 2025

మండల స్థాయి ప్రజావాణికి మంచి ఆదరణ: ADB కలెక్టర్

image

పైలెట్ ప్రజావాణి, బహిరంగ విచారణలో ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతున్నాయని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బుధవారం రాజస్థాన్ నుంచి వచ్చిన మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్, సివిల్ సొసైటీ యాక్టివిస్ట్ నిఖిల్ డేతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజావాణి, బహిరంగ విచారణలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందనడంతో కలెక్టర్‌ను వారు అభినందించారు.

News February 12, 2025

ఇంద్రవెల్లి: మాజీ సర్పంచ్ మృతి

image

ఇంద్రవెల్లి మండలంలోని శంకర్ గూడా గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ (36) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. సంవత్సరం నుంచి ఆయన రక్తహీనతతో బాధపడుతున్నారు. కాగా బుధవారం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

error: Content is protected !!