News February 25, 2025

ఆదిలాబాద్‌లో యువకుడి దారుణ హత్య

image

ఆదిలాబాద్‌లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మార్కెట్ యార్డ్ వెనకాల ఇందిరానగర్‌లో రవితేజ (30) అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం ఉదయం హత్య చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్స్, డాగ్ స్క్వాడ్ బృందాలతో ఆధారాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. మృతుడు క్రాంతినగర్ వాసిగా గుర్తించినట్లు తెలిపారు.

Similar News

News December 7, 2025

కృష్ణా: వసతి గృహాల పర్యవేక్షణకు యాప్

image

వసతి గృహాల నిర్వహణలో పారదర్శకత, నాణ్యత పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో HPTS అనే ప్రత్యేక యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా అధికారులు వసతి గృహాల్లోని సేవలను నిరంతరం పర్యవేక్షించవచ్చు. రోజువారీ, వారాంతపు నిర్వహణ పనులను తప్పనిసరిగా ఈ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

News December 7, 2025

ANU పరీక్షల్లో డిజిటల్ విధానం.. ప్రశ్నపత్రాల లీకేజీకి చెక్

image

ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలను అరికట్టేందుకు ఆచార్య నాగార్జున వర్సిటీ (ANU) డిజిటల్ విధానాన్ని ప్రారంభించింది. ఇకపై పరీక్షా కేంద్రాలకు పాస్‌వర్డ్ ఉన్న సీడీల్లోనే ప్రశ్నపత్రాలు పంపనున్నారు. ఇప్పటికే బీఈడీ, లా కోర్సుల్లో ఈ పద్ధతి అమలవుతోంది. మోడరేషన్ కోసం గుంటూరు, నరసరావుపేట, తెనాలి ప్రాంతాల్లో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశారు.

News December 7, 2025

వరంగల్: సర్పంచ్‌కు పోటీ.. 9 మందిది ఒకే ఇంటి పేరు!

image

జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో సర్పంచ్ స్థానానికి 12 మంది బరిలో ఉన్నారు. వీరిలో 9 మంది ఒకే ఇంటి పేరు గల అభ్యర్థులు ఉండడం ఓటర్లకు తలనొప్పిగా మారింది. సీనపెల్లి అనే ఇంటి పేరుతో ఉన్న అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తుండగా, ఇందులో సీనపెల్లి రాజు అనే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. దీంతో ఎన్నికల పోలింగ్ సమయంలో ఎవరికి ఓట్లు పడతాయో అర్థం కానీ పరిస్థితి.