News February 15, 2025
ఆదిలాబాద్: అప్పు తీర్చలేక రైతు ఆత్మహత్య

ADB జిల్లా గుడిహత్నూర్ మండలం ఘర్కంపేట్ గ్రామానికి చెందిన మాధవ్ (53) అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధ తట్టుకోలేక బుధవారం మధ్యాహ్నం పురుగుమందు తాగి ఇంటికి వచ్చాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్లో రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.
Similar News
News March 22, 2025
టెన్త్ పరీక్షలు.. విద్యాశాఖ వార్నింగ్

TG: రాష్ట్రంలో తొలి రోజు టెన్త్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని విద్యాశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రశ్నాపత్రం లీకైందంటూ వాట్సాప్లో చక్కర్లు కొడుతున్న ప్రచారం తప్పని కొట్టిపారేసింది. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా నిన్న జరిగిన పరీక్షకు 99.67శాతం హాజరు నమోదైనట్లు తెలిపింది.
News March 22, 2025
జూన్ వరకు జాగ్రత్తగా ఉండాలి: బాపట్ల కలెక్టర్

పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ నివారణకు చేయవలసిన, చేయకూడని పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి అధికారులకు తెలిపారు. వడగాల్పులకు తీసుకోవలసిన జాగ్రత్తలు, ప్రణాళికపై అధికారులతో శుక్రవారం ఆయన బాపట్ల కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. మార్చి నుంచి జూన్ వరకు జిల్లాలో ఎండ తీవ్రత వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News March 22, 2025
నేడు ఓర్వకల్లుకు పవన్ కళ్యాణ్ రాక

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాకు రానున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే నీటి కుంటల పనులను ఓర్వకల్లు మండలం పూడిచర్లలో ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు.