News March 29, 2024
ఆదిలాబాద్: అయిదేళ్లలో 68 మంది మృతి
ఉమ్మడి ADB జిల్లాలో ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు యువకులు, చిన్నారులు ఈతకొట్టేందుకు బావులు, చెరువులకు వెళ్తున్నారు. నీటిలోతు తెలియక మునిగి మృతి చెందుతున్నారు. గత అయిదేళ్లలో 68 మంది ఈత రాక నీటిలో మునిగి మృతి చెందారు. హోలీ రోజున ఈత రాక 5గురు మృతి చెందారు. కొత్తవారు తప్పనిసరిగా శిక్షకుల సమక్షంలో ఈత నేర్చుకోవాలని పూర్తిగా నేర్చుకున్న తర్వాతే ఒంటరిగా ఈత కొటేందుకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News January 13, 2025
బ్యాంకు సామగ్రి చోరీకి యత్నం.. ఒకరికి రిమాండ్: CI
ఆదిలాబాద్ కలెక్టరేట్లోని SBI బ్యాంకు సామగ్రిని చోరీ చేయటానికి ఆదివారం దుండగులు యత్నించినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. ఇద్దరు దుండగులు బ్యాంకు పాత ఫర్నీచర్, నగదు లెక్కించే చెడిపోయిన యంత్రం చోరీకి ప్రయత్నిస్తుండగా.. వాచ్మెన్ నర్సింలు గమనించారు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో వారు పరారయ్యారు. వీరిలో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.
News January 13, 2025
కోటపల్లి: కోడి పందెం స్థావరంపై పోలీసుల దాడులు
కోటపల్లి మండలంలోని నాగంపేట బొప్పారం గ్రామ శివారున ఉన్న అటవీ ప్రాంతంలో కోడిపందేల స్థావరంపై ఆదివారం ఎస్సై రాజేందర్ సిబ్బందితో దాడులు నిర్వహించారు. ఎస్సై కథనం ప్రకారం.. దాడుల్లో ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే 10 కోళ్లు, 7 మొబైల్స్ రూ.59,780 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4 బైక్లు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్టు SI తెలిపారు.
News January 13, 2025
నేడు ఆసిఫాబాద్ జిల్లాకు మంత్రి సీతక్క రాక
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క సోమవారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు రానున్నట్లు మంత్రి పీఏ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు రెబ్బన, వాంకిడి, కెరమెరి మండలాల్లో జంగు బాయి దేవత సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారన్నారు. అక్కడ నుంచి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.