News July 12, 2024

ఆదిలాబాద్: ఆప్షన్ల ప్రక్రియకు నేడే ఆఖరు

image

ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించిన ఆప్షన్ల ప్రక్రియ గడువు నేటితో ముగియనుంది. జిల్లాస్థాయి అధికారి నుంచి అటెండర్ వరకు నాలుగేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారి సీనియారిటీ జాబితాలను ఆయా శాఖల అధికారులు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు ప్రభుత్వం అందించిన జాబితాల ఆధారంగా సదరు అధికారులు, ఉద్యోగుల నుంచి ఆప్షన్లను స్వీకరించారు. ఇందుకోసం ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు గడువు ఇచ్చారు.

Similar News

News November 1, 2025

ఆదిలాబాద్: నూతన డీఈఓగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావు

image

ఆదిలాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారిగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌‌ను నియమిస్తూ కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వలు జారీ చేశారు. ప్రస్తుత డీఈవోగా పని చేస్తున్న ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా పర్సనల్ సెలవుల్లో వెళ్లునున్నారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్ రావుకు నవంబర్ 4 నుంచి ఇన్‌ఛార్జి డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

News October 31, 2025

ఆదిలాబాద్: విద్యతో పాటు సృజనాత్మకత అవసరం: కలెక్టర్

image

యువత సమాజంలో సానుకూల మార్పు సృష్టించాలంటే విద్యతో పాటు నైపుణ్యాలు, సృజనాత్మకత కూడా అవసరమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. యువత తమ ప్రతిభను ప్రదర్శించి, సామాజిక అభివృద్ధికి దోహదపడాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం ‘బోస్ ఫెలోషిప్’ సామాజిక సంస్థ భారత్ దేకో ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. సమాజంలో స్థిరమైన మార్పు రావాలంటే విద్యతో పాటు సమర్థవంతమైన నైపుణ్యాలు కూడా అవసరమన్నారు.

News October 31, 2025

ADB: శిశు మరణాల నివారణకు పని చేయాలి

image

ఆదిలాబాద్ వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం జరిగిన నవజాత శిశు సంరక్షణ శిక్షణ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణలో ప్రతిభ చూపిన వైద్యులు, సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు, మెమొంటోలను అందజేశారు. శిశు మరణాల నివారణకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.