News March 16, 2025

ఆదిలాబాద్-ఆర్మూర్ లైన్‌కు మోక్షం ఎప్పుడో…?

image

ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటుచేయాలని రెండు జిల్లాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు. ADB నుంచి నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్‌కు నిత్యం భారీ సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తారు. వెంటనే ADB-ARMR రైల్వే లైన్ తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అయితే రైల్వే‌లైన్ ఏర్పాటుచేయలేని ప్రభుత్వాలు ఎయిర్‌పోర్టు తెస్తామంటున్నాయని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

Similar News

News April 21, 2025

నిజామాబాద్: తేలనున్న 36,222 మంది భవితవ్యం

image

మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు మంగళవారం విడుదల చేయనుంది. NZB జిల్లాలో మొత్తం 36,222 మంది పరీక్షలు రాశారు. ప్రథమ సంవత్సరంలో 17,789 మంది, ద్వితీయ సంవత్సరంలో 18,433 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం రేపు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST

News April 21, 2025

NZB: ఫేక్ వీడియోలతో ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం: షబ్బీర్ అలీ

image

అభివృద్ధిని చూసి ఓర్వలేక ఫేక్ వీడియోలతో ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారన్నారు. కేసీఆర్ తన కుటుంబ అభివృద్ధి కోసం కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి రూ.లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.

News April 21, 2025

NZB: 9,970 GOVT జాబ్స్.. లైబ్రరీలకు నిరుద్యోగుల క్యూ

image

సికింద్రాబాద్ సహా పలు రైల్వే రీజియన్లలో 9,970అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టుల నోటిఫికేషన్ రావడంతో నిజామాబాద్‌లోని లైబ్రరీలకు నిరుద్యోగులు క్యూ కడుతున్నారు. సిలబస్ బుక్స్‌తో కసరత్తు చేస్తున్నారు. కొందరేమో HYDకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అవుతున్నారు. ఆన్‌లైన్ అప్లికేషన్‌కు మే 11 చివరి తేదీ. వెబ్‌సైట్: https://indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,7,1281

error: Content is protected !!